Viral News: రెస్టారెంట్‌ను పేల్చేస్తానంటూ కస్టమర్ ఫోన్.. కారణం ఆరా తీయగా మైండ్ బ్లాంక్.!

|

Jul 01, 2021 | 5:13 PM

కొందరు ఆహారం దగ్గర ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. నచ్చిన ఆహారం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇంకొందరు అయితే ఎంతకైనా తెగిస్తారు.!..

Viral News: రెస్టారెంట్‌ను పేల్చేస్తానంటూ కస్టమర్ ఫోన్.. కారణం ఆరా తీయగా మైండ్ బ్లాంక్.!
Hotel
Follow us on

కొందరు ఆహారం దగ్గర ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. నచ్చిన ఆహారం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇంకొందరు అయితే ఎంతకైనా తెగిస్తారు.! ఇదిలా ఉంటే ఏ విషయమైన సృతి మించకుండా ఉంటే బాగుంటుంది.. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం అనర్ధాలకు దారి తీస్తుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆహారం విషయంలో ఓ వ్యక్తి ఏకంగా హద్దులు దాటేశాడు. రెస్టారెంట్‌కు ఫోన్ చేసే మరీ బాంబులతో పేల్చేస్తానంటూ బెదిరించాడు. ఇంతకీ అతడు ఇంతలా ఆగ్రహించడానికి కారణం ఏంటని ఆరా తీయగా.. అందరికీ షాక్ తగిలింది. ఆర్డర్ చేసిన వాటితో సాస్ ఇవ్వడం మర్చిపోయారని అతగాడు ఇంతలా రెచ్చిపోయాడట. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని లోవాలో నివాసముంటున్న రోబర్ట్ గాల్విట్జెర్ అనే వ్యక్తి మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌కు ఫోన్ చేసి చికెన్ నగ్గెట్స్‌ను ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ కోసం ఎదురు చూశాడు. వచ్చీ రాగానే ఓ పట్టు పట్టాలని భావించాడు. ఇంతలోనే ఆర్డర్ వచ్చింది. తెరిచి ఓపెన్ చేసి చూడగా.. అందులో సాస్ మిస్సింగ్. ఇంకేముంది మనోడి కోపం తన్నుకొచ్చింది. డెలివరీ తీసుకొచ్చిన సిబ్బందిని కొట్టడమే కాకుండా.. రెస్టారెంట్‌కు ఫోన్ చేసి బాంబులతో పేల్చి చంపేస్తానంటూ బెదిరించాడు. దీనితో రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులు ఫిర్యాదు చేయగా.. వాళ్లు గాల్విట్జెర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: 

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!