Viral: నదిలో వేటకు వెళ్లి వల వేసిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి షాక్
ఎప్పట్లానే వారు నదిలో చేపల వేటకు వెళ్లారు. వలలో ఓ మాదిరిగా చేపలు పడ్డాయి. ఈ పూటకి పర్లేదులే అనుకున్నారు. అయితే పడ్డ చేపల్ని గ్రేడింగ్ చేస్తుండగా.. అందులో ఓ ప్రమాదకర ఫిష్ కనిపించింది. అదేంటి..? దానితో డేంజర్ ఏంటి తెలుసుకుందాం పదండి....
అది మహారాష్ట్రలోని కొల్హాపూర్లోని కసరి నది పరీవాహక ప్రాంతం. సునీల్ జాదవ్, అనిల్ జాదవ్, కృష్ణ సత్పుటే ఈ ప్రాంతంలో చేపల వ్యాపారం చేస్తూ పొట్ట పోసుకుంటున్నారు. తాజాగా కసరి నదిలో చేపల వేటకు వెళ్లిన వారు.. వలలో చిక్కిన చేపను చూసి కంగుతిన్నారు. ఎందుకంటే.. అదేదో తినే చేప లేదా మెడిసిన్ కోసం ఉపయోగించే చేప కాదు. ప్రమాదకర సక్కర్ ఫిష్. దాన్నే దెయ్యం చేప అని కూడా అంటారు. ఈ చేప ఏదైనా చెరువు లేదా సరస్సులోకి ఎంట్రీ ఇచ్చిందంటే.. మిగతా జాతి చేపలన్నీ సర్వనాశనం. వెంటాడి వేటాడి చంపేస్తాయ్.
కొరమేను, శీలావతి, బొమ్మిడాయి, బొచ్చ, పండుగప్ప ఈ టైపు చేపలు కావివి. టోటల్ డిఫరెంట్. ఒంటిపైన పొలుసులు ఉండవు. చారలు మాత్రమే ఉంటాయి. నోరు కూడా ముందు భాగంలో ఉండదు.. గదువ భాగాన ఉంటుంది. ఆకారం కూడా మిగతా చేపల్లా ఉండదు.. విమానాన్ని పోలి ఉంటుంది. ఒంట్లో మాంసం ఉండదు.. రాయిలా ఉండే బోన్స్ ఇరువైపులా ఉంటాయి. వాడుక భాషలో చేపల రైతులు వీటిని డెవిల్ ఫిష్, విమానం ఫిష్ అని పిలుస్తుంటారు. వన్స్ ఇది ఎంటర్ అయితే డెవిల్ ఫిష్ తన సంతానాన్ని వంద రెట్లు పెంచేసుకుంటుంది. మాంసం పెడితే నలనలా నమిలేస్తుంది. రాళ్లనైనా జీర్ణం చేసుకునే శక్తి దీనిది. ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నా జీవిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డెవిల్ ఫిష్.. జగమొండిది. భూమి పొరల్లోకి వెళ్లిపోతుంది. ఈ గట్టు నుంచి ఆ గట్టులోకి సునాయాసంగా దూరిపోతుంది. డెవిల్ పిష్ తరహా చేపలు ఎక్వేరియంలలో కనిపిస్తాయి. ఇవి కేవలం ఏదో అట్రాక్షన్ కోసమే పనికొస్తాయి. ఇవి తినడానికి పనికిరావు. పైగా మిగతా చేపలను ఎదగనీయవు. అందుకే ఈ తరహా చేపలు ఎవరూ పెంచరు.
సక్కర్ చేప హోంనివారిస్కు చెందిందిగా మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీని శాస్త్రీయ నామం హైపోస్తోమస్ క్లిపికోస్తోమస్. నార్త్ అమెరికాలో దీన్ని ఆక్వేరియంలలో పెంచుతారు. ఆక్వేరియం అద్దాలకు పెట్టే పాచి తింటూ ఇవి బతికేస్తాయి. అయితే ఉద్యోగుల బదిలీల సమయంలో, ఆక్వేరియంలు తీసేసినపుడు ఇలాంటి చేపలను కాలువలో పడేయడంతో ఇవి కాలువల్లో చేరి తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. నదుల్లోకి, పంట కాలువల్లోకి చేరి, ఆ తర్వాత చెరువుల్లో చేరుతున్నాయి. ఒంటి నిండా మచ్చలు, తల పైభాగంలో కళ్లు ఉండటంతో పాటు పళ్లు చాలా పదునుగా ఉండటంతో వీటిని నాశనం చేసే మందును ఇప్పటి వరకు కనిపెట్టలేదంటున్నారు మత్స్యశాఖ అధికారులు. ఇవి ఇతర చేపల గుడ్లను, చేపలను అలవోకగా మింగేస్తాయి. అలానే ఇవి తినడానికి కూడా పనికిరావు. దీంతో ఈ చేప ఎక్కడ కనిపించినా మత్స్యకారులు, ఆక్వా రైతులు ఆందోళన చెందుతూ ఉంటారు. (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.