
రాజస్థాన్లోని జైపూర్ నగరంలో చెట్లను నరకకుండా, వాటి చుట్టూనే నిర్మించిన ఒక అద్భుతమైన పర్యావరణ హితమైన ఇల్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వినూత్న నిర్మాణాన్ని చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ప్రకృతిని ధ్వంసం చేయకుండా, ఇళ్లను సహజసిద్ధంగా చల్లగా ఉంచుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ అంటూ ఆయన ట్విట్టర్ (X) వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ, సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రాకు ఈ ఇంటి రూపకల్పన ఎంతగానో నచ్చింది. ఆయన ఈ వీడియోను షేర్ చేస్తూ.. మనం ప్రకృతితో కలిసి జీవించాలే తప్ప, ప్రకృతిని నాశనం చేస్తూ కాదు. ఇళ్లను సహజసిద్ధంగా చల్లగా ఉంచుకోవడానికి, గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా చూసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని కొనియాడారు. సాంకేతికతను, ప్రకృతిని మేళవించి చేసిన ఈ నిర్మాణం భవిష్యత్తు తరాలకు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఇంటి ప్రత్యేకత ఏమిటంటే, గది లోపల, బాల్కనీల గుండా పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు పైకి వెళ్తాయి. దీనివల్ల ఇంటి లోపలికి నేరుగా సూర్యరశ్మి పడకుండా చెట్ల నీడ రక్షణగా నిలుస్తుంది. ఫలితంగా, వేసవి కాలంలో బయట ఎండలు ఎంత మండిపోతున్నా, ఇంటి లోపల మాత్రం ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఏసీ (Air Conditioner) అవసరం లేకుండానే గదులు సహజంగా చల్లటి అనుభూతిని ఇస్తాయి.
వీడియో ఇక్కడ చూడండి..
We still don’t know enough about the full consequences of climate change.
But we do know this: intense heat waves in India are no longer exceptions. They’re becoming a way of life.
These homeowners have responded by changing THEIR way of life.
By changing the way they live,… pic.twitter.com/9pr5yIktJv
— anand mahindra (@anandmahindra) May 22, 2026
ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యజమాని, ఆర్కిటెక్ట్ ఆలోచనా విధానాన్ని మెచ్చుకుంటున్నారు. మనం ప్రకృతిని కాపాడితే, అది మనల్ని కాపాడుతుంది అనడానికి ఈ ఇల్లే నిదర్శనం అని కామెంట్లు పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లు కట్టుకునేటప్పుడు ఇలాంటి పర్యావరణ హితమైన పద్ధతులను పాటిస్తే బాగుంటుందని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..