Big Breaking: లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ హతం

ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్ట్ ఉస్మాన్‌ హతమయ్యాడు. జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ జిల్లా రెబ్బాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ ఇవాళ ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది

Big Breaking: లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ హతం
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 10:01 PM

ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్ట్ ఉస్మాన్‌ హతమయ్యాడు. జమ్ముకశ్మీర్‌ బారాముల్లాలోని సోపోర్‌ రెబ్బాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ ఇవాళ ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అందులో లష్కరే తోయిబాకు చెందిన ఉస్మాన్ ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. సోపోర్‌లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌, ఒక పౌరుడు మృతి చెందగా.. అందులో ఉస్మాన్ హస్తం ఉందని విజయ్ కుమార్ తెలిపారు. అయితే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ జవాన్లు, సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం తెల్లవారుజాము సమయంలో మొదలైన ఎన్‌కౌంటర్ దాదాపు‌ 13 గంటల పాటు సాగింది. ఇక ఎదురుకాల్పుల్లో ఒక ఇళ్లు ధ్వంసం అయినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.