Rajanna Sircilla: ప్రేమించు – పెళ్లి చేసుకో- లేదంటే పురుగుమందు తాగి చావు.. యువతికి వేధింపులు.. చివరకు..

టీనేజ్. ఏది మంచో, ఏది చెడో తెలియని కన్ఫ్యూజన్ ఏజ్. ఆ సమయంలో కలిగే ఆకర్షణలకు ఎట్రాక్ట్ అయ్యి.. జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. ప్రేమ...

Rajanna Sircilla: ప్రేమించు - పెళ్లి చేసుకో- లేదంటే పురుగుమందు తాగి చావు.. యువతికి వేధింపులు.. చివరకు..
Harassment
Follow us

|

Updated on: Dec 28, 2022 | 10:50 AM

వారిది ఇంటర్ చదువుకునే వయసు. అంటే టీనేజ్. ఏది మంచో, ఏది చెడో తెలియని కన్ఫ్యూజన్ ఏజ్. ఆ సమయంలో కలిగే ఆకర్షణలకు ఎట్రాక్ట్ అయ్యి.. జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. ప్రేమ పేరుతో తప్పటడుగులు వేస్తూ కన్నవారికి శోకాన్ని మిగిల్చుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. తనను ప్రేమించాలంటూ ఓ యువతిని వేధించిన యువకుడు.. ఆమె చనిపోయేలా ప్రేరేపించాడు. తనను లవ్ చేయకపోతే పురుగులమందు తాగాలని బలవంతం చేశాడు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆమె పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన త్రిష.. గంగాధరలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న సతీశ్‌ అనే యువకుడు తనను ప్రేమించాలంటూ ఆరు నెలలుగా వెంట పడుతున్నాడు. యువతి నిరాకరించడంతో వేధించడం స్టార్ట్ చేశాడు.

అతని వేధింపులు తట్టుకోలేక ఆమె.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు సతీశ్‌కు వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోవాలని, తమ కూతురి వెంట పడొద్దని హెచ్చరించారు. అయినా సతీశ్ లో మార్పు రాలేదు. అంతే కాకుండా విపరీతంగా వేధించడం మొదలెట్టాడు. ఈ క్రమంలో సోమవారం ఎవరూ లేని సమయంలో త్రిష ఇంటికి వెళ్లాడు. ‘ప్రేమించు.. పెళ్లి చేసుకో.. లేదంటే పురుగుమందు తాగి చావు..’అంటూ బెదిరించాడు. త్రిష ఇంటికి వెళ్లిన యువకుడు.. తనను ప్రేమించకుంటే పురుగుల మందు తాగాలని బలవంతం చేశాడు. డబ్బా చూపిస్తూ ఆత్మహత్య చేసుకోవాలని బెదిరించాడు.

సతీశ్‌ వేధింపులు భరించలేక.. త్రిష పురుగు మందు తాగింది. అదే సమయంలో అక్కడికి త్రిష సోదరి రావడం చూసి సతీశ్‌ పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె.. బంధువులకు ఈ విషయాన్ని చెప్పింది. వారి సహాయంతో త్రిషను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. ఈ ఘటనపై త్రిష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తించిన సతీశ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..