Telangana Corona: తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..
Telangana Corona Updates: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 494 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Telangana Corona Updates: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 494 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో రికవరీల సంఖ్య 129కి చేరింది. కరోనాతో చనిపోయినవారి సంఖ్యంగా 0 గా ఉండటంతో ఊరటినిచ్చే అంశం. కాగా, గడిచిన 24 గంటల్లో 28,865 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. 494 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 517 శాంపిల్స్ రిజల్ట్స్ వెయిటింగ్లో ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కరోనా బులెటిన్ను విడుదల చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,97,632 మంది కరోనా బారిన పడగా.. 7,90,473 మంది కోలుకున్నారు. 4,111 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 99.10 శాతం ఉంది. మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 3,048 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్లోనే 315 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత స్థానంలో అత్యధికంగా రంగారెడ్డిలో 102, మేడ్చల్ మల్కాజిగిరి 31 చొప్పున నమోదు అయ్యాయి.