అతిభారీ వర్షాల ఎఫెక్ట్‌.. నేడు బడులకు సెలవ్‌!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో మెదక్‌, కామారెడ్డి జిల్లాలో ఏకంగా అధికారులు రెడ్‌ అలెర్ట్ జారీ చేశారు. ఇటు హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. కాలుతీసి బయటపెట్టలేని విధంగా వానలు పడుతున్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌లోని బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో..

అతిభారీ వర్షాల ఎఫెక్ట్‌.. నేడు బడులకు సెలవ్‌!
School Holiday Today

Updated on: Aug 28, 2025 | 7:39 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో మెదక్‌, కామారెడ్డి జిల్లాలో ఏకంగా అధికారులు రెడ్‌ అలెర్ట్ జారీ చేశారు. ఇటు హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. కాలుతీసి బయటపెట్టలేని విధంగా వానలు పడుతున్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌లోని బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో సర్కార్ గురువారం (ఆగస్ట్‌ 28) పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో వరుసగా సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంల రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తీరం వెంట 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడిన తీవ్ర అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో గురువారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా జిల్లాల్లో పాఠశాలలు నిర్వహించాలా? లేదా? అనేది ఆయా జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.