
ఈ మధ్య భారీ కొండచిలువలు, కింగ్ కోబ్రా పాములు హల్చల్ చేస్తున్నాయి.. ముఖ్యంగా భారీ కొండ చిలువలు జనం మధ్య సంచారం మనుషుల ప్రాణాలకు ముప్పిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ మహిళ పొలం పనులు చేస్తుండగా కొండచిలువ దాడి చేసింది.. ఈ క్రమంలో అంతా అప్రమత్తమై.. ఆమెను కాపాడారు.. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే.. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ భారీ కొండచిలువ ప్రధాన రహదారిపై హల్చల్ చేసింది.. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు కొండచిలువను చూసి భయంతో హడలెత్తిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది.. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో నడిరోడ్డుపై బారీ కొండచిలువ ప్రత్యక్షమైంది.. సుమారు 12 ఫీట్ల పొడవు ఉన్న కొండచిలువ రోడ్డు దాటుతూ కాసేపు రోడ్డుపై హల్చల్ చేసింది..
తెల్లవారుజామున భారీ కొండచిలువ కలకలం రేపింది. ఆ మార్గంలో వెళ్తున్న బాటసారిలు కొండచిలువను చూసి ఒక్కసారిగా హడలెత్తిపోయారు.. ఆలయం పక్కనుండి రోడ్డు దాటుతున్న దృశ్యాలు గమనించారు.. పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..