
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో మరో మైలురాయి ముందుకు పడింది. నగరంలో మరో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్లోని ఫతుల్లాగూడలో 9 ఎకరాల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని నిర్మించిన భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో రోజుకు 500 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే సామర్థ్యంతో ఉన్న రెండవ సి అండ్ డి (కన్స్ట్రక్షన్ & కూల్చివేత) వ్యర్ధాల రీ సైక్లింగ్ కర్మాగారానికి మంత్రి కేటీఆర్ ప్రారంభం.

హైదరాబాద్లో మొత్తం సి అండ్ డి వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యం ఇప్పుడు 1000 టిపిడి(టన్స్ పర్ డే) అయిందని, ఇక ఇలాంటి ప్లాంట్ లను తెలంగాణలోని ఇతర పట్టణాల్లో ప్లాన్ చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సుమారుగా 2 వేల టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయి. ఇక ఈ శిథిలాల రీ సైక్లింగ్ ప్లాంట్స్ తో సౌతిండియాలోనే తెలంగాణ ది బెస్ట్ గా నిలవనుంది. ఇంతకు ముందు జీడిమెట్లలో కూడా ఒక భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థ్యాల రీసైక్లింగ్ ప్లాంటును గత ఏడాది కేటీఆర్ ప్రారంభించారు.