
ప్రధాని నరేంద్ర మోదీ HICC నుంచి గచ్చిబౌలికి బయలుదేరి వెళ్లారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత మోదీ ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా కాకతీయ టెక్స్టైల్ను ప్రారంభించారు. గుడెబలలూర్-మహబూబ్నగర్ 4 లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్గా మోదీ శంకస్థాపన చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణను నెంబర్వన్ చేయడమే మా లక్ష్యమని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధిపై అందరం దృష్టి పెట్టాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారు మంత్రి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ రైల్వే నెట్వర్క్ను విస్తరించారని, తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చారని కిషన్రెడ్డి అన్నారు.
హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర మఖ్యమంత్రి రేవంత్రెడ్డి మోదీని శాలువాతో సత్కరించారు. మోదీకి నంది జ్ఞాపికను అందించారు సీఎం రేవంత్. అలాగే మోదీకి శ్రీరాముడి ప్రతిమను బహుకరించారు మంత్రి కిషన్రెడ్డి.
Modi
కొద్దిసేపటి క్రితమే బేగం పేట్ కు చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గవర్నర్ శుక్లాలు ఘన స్వాగతం పలికారు. బేగంపేట్ నుంచి నేరుగా మోదీ HICCకి బయలుదేరారు.
ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరారు. కాసేపట్లో అభివృద్ది పనులకు శంకస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ.
హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి భట్టి విక్రమర్క స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని HICCకి వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ విమనాశ్రయానికి చేరుకున్నారు. మోదీని తెలంగాణ మంత్రులు పొన్న ప్రభాకర్, భట్టి విక్రమార్క, అలాగే అజారుద్దీన్, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అలాగే మోదీ కొద్దిసేపట్ల HICCకి వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మోదీకి ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో కాస్త ఆలస్యం అవుతున్నట్లు ప్రధాని తెలంగాణ సీఎం కార్యాలయానికి సమాచారం అందించింది. అర గంట పాటు ఆలస్యంగా మోదీ రానున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో పర్యటిస్తున్నందు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మధ్యాహ్నం ఒంట గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. మోదీకి బీజేపీ ముఖ్యనేతలు ఘన స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా మోదీ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మోదీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొంటారు.
మరికాసేపట్లో హైదరాబాద్కు ప్రధాని మోదీ రానున్నారు. మోదీని బీజేపీ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు.
PM Modi in Hyderabad Live: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు ఐదు గంటల పాటు నగరంలో గడపనున్న ప్రధాని, వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.