ఇండిగో నిర్లక్ష్యం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
ఇండిగో ఫ్లైట్స్ ఆలస్యం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విజయవాడ, ముంబై వెళ్లే ఇండిగో విమానాలు దాదాపు 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ నుండి గోవాతోపాటు మరికొన్ని విమానాలను ఇండిగో క్యాన్సిల్ చేసింది. దీంతో ఎయిర్పోర్టులో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానాలు ఆలస్యంగా నడవడం, ముందస్తు […]
ఇండిగో ఫ్లైట్స్ ఆలస్యం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విజయవాడ, ముంబై వెళ్లే ఇండిగో విమానాలు దాదాపు 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ నుండి గోవాతోపాటు మరికొన్ని విమానాలను ఇండిగో క్యాన్సిల్ చేసింది. దీంతో ఎయిర్పోర్టులో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానాలు ఆలస్యంగా నడవడం, ముందస్తు సమాచారం లేకుండా కొన్నింటిని క్యాన్సిల్ చేయడంపై ప్యాసింజర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.