Telangana: ఆస్తి కోసం వారసుల ఘర్షణ.. వాటా కావాలంటూ తండ్రిని అంబులెన్సులో తీసుకొచ్చారు
మనుషుల మధ్య మానవసంబంధాలు రోజురోజుకు మంటగలుస్తున్నాయి. మనీ మోజులో పడి రక్త సంబంధాన్ని అపహాస్యం చేసుకుంటున్నారు. డబ్బుల కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. సొంతవారు,...
మనుషుల మధ్య మానవసంబంధాలు రోజురోజుకు మంటగలుస్తున్నాయి. మనీ మోజులో పడి రక్త సంబంధాన్ని అపహాస్యం చేసుకుంటున్నారు. డబ్బుల కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. సొంతవారు, అయిన వారు అనే తేడా లేకుండా హత్యలు చేసేందుకూ వెనుకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. బాబాయి ఇంట్లో తమకూ వాటా ఉందని వారసులు దారుణానికి తెగబడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంబులెన్సులో ఉన్న తండ్రి పట్ల కనీసం కనికరం చూపకుండా చిన్నాన్నతో గొడవకు దిగారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చేపూరు గ్రామానికి చెందిన హరినారాయణ, ప్రహ్లాద అన్నదమ్ములు. హరినారాయణకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల హరినారాయణ అనారోగ్యానికి గురవడంతో చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్పై చికిత్స అందించారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, తాము చేయగలిగిందేమి లేదని వైద్యులు చెప్పారు. ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బుధవారం అంబులెన్సులో చేపూరు గ్రామానికి తీసుకువచ్చారు.
అంబులెన్సు సహా ప్రహ్లాద ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. ప్రహ్లాద కుమారులు అభ్యంతరం చెప్పడంతో గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో తమకూ వాటా ఇవ్వాలని, లేకుంటే తమ తండ్రి చనిపోతే ఇక్కడే ఖననం చేస్తామని హరినారాయణ వారసులు బెదిరించారు. దీంతో చేసేదేమీ లేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గుర్రంపోడు ఎస్సై శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి సర్దిచెప్పారు. దీంతో హరినారాయణను అతని ఇంటికి తీసుకెళ్లారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Optical Illusion: ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా.. ఫోటోలో మిస్టేక్ను పట్టుకోలేకపోతున్న జనాలు..!