కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్.. కీలకంగా వ్యవహరించిన మంత్రి ఎవరంటే..
ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వివిధ పార్టీల ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు తమ జిల్లాల్లోని ముఖ్యమైన నేతలతో సమావేశమవుతూ తమవైపుకు తిప్పుకుంటున్నారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా.. రారా.. అనే మీమాంసలో ఉన్న నల్గొండ కీలకనేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎట్టకేలకు తన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇప్పించారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వివిధ పార్టీల ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు తమ జిల్లాల్లోని ముఖ్యమైన నేతలతో సమావేశమవుతూ తమవైపుకు తిప్పుకుంటున్నారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా.. రారా.. అనే మీమాంసలో ఉన్న నల్గొండ కీలకనేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎట్టకేలకు తన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇప్పించారు. పరోక్షంగా తాను కాంగ్రెస్లో చేరినట్టు చెప్పకనే చెప్పారు.
ఇవ్వాళ ఉదయం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బ్రేక్ ఫాస్ట్కు ఆహ్వానించిన గుత్తా. తన కుమారున్ని కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తాని కోమటిరెడ్డితో చెప్పారు. తన కుమారుడి భవిష్యత్తును నీ చేతుల్లో పెడుతున్నానని.. అండగా నిలవాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి.. దీపాదాస్ మున్షితో మాట్లాడి.. గుత్తా నివాసానికి ఆహ్వానించారు. గుత్తా కుటుంబం కాంగ్రెస్లోకి వస్తే పార్టీకి ఉపయోగపడుతుందని విషయం మొత్తం దీపాదాస్కు వివరించారు మంత్రి కోమటి రెడ్డి.
ఆ వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ కలిసి గుత్తా అమిత్ను సీఎం నివాసానికి తీసుకుపోయారు. ఆ తరువాత ముఖ్యమంత్రి సమక్షంలో గుత్తా అమిత్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. రెండు నెలలుగా మీడియాలో నానుతున్న గుత్తా కాంగ్రెస్ చేరిక అంశం రెండు గంటల్లోనే కార్యరూపం దాల్చడం వెనక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలకంగా వ్యవహరించడమే కారణమనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..