CM KCR: ‘బీఆర్ఎస్ ప్రభుత్వమంటేనే రైతు రాజ్యం’.. నాగర్‌కర్నూల్ సభలో సీఎం కేసీఆర్..

| Edited By: seoteam.veegam

Jun 07, 2023 | 3:58 PM

CM KCR: ధరణిలో 99 శాతం సమస్యలు పూర్తయ్యాయని, బీఆర్ఎస్ ప్రభుత్వమంటేనే రైతు రాజ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్ట‌రేట్, ఎస్‌పీ ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య ప్రారంభం వంటి పలు కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. అనంత‌రం..

CM KCR: ‘బీఆర్ఎస్ ప్రభుత్వమంటేనే రైతు రాజ్యం’.. నాగర్‌కర్నూల్ సభలో సీఎం కేసీఆర్..
CM KCR in Nagarkurnool Public meet
Follow us on

CM KCR: ధరణిలో 99 శాతం సమస్యలు పూర్తయ్యాయని, బీఆర్ఎస్ ప్రభుత్వమంటేనే రైతు రాజ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్ట‌రేట్, ఎస్‌పీ ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య ప్రారంభం వంటి పలు కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. అనంత‌రం అక్క‌డే ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ‘ఒక‌ప్పుడు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ఎక్క‌డ చూసినా గంజి కేంద్రాలే ఉండేవి.. ఇప్పుడు ఆ గంజి కేంద్రాలు మాయం అయ్యాయి.. పంట‌ల కొనుగోలు కేంద్రాలు ప్ర‌త్య‌క్షం అయ్యాయి. తెలంగాణ రాక‌పోయి ఉంటే నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కాక‌పోయేది. ఎస్పీ, క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాలు వ‌చ్చేది కాదు. కానీ ఇప్పుడు అద్భుతంగా ఈ భ‌వ‌న‌నాలు రూపుదిద్దుకున్నాయ’ని అన్నారు.

ఇంకా ‘తెలంగాణ ఉద్య‌మానికి చ‌రిత్ర ఉంది. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో చాలా వెనుక‌బాటు త‌నం ఉంది. సాగు, తాగునీటికి , క‌రెంట్‌కు ఇబ్బందులు ఉన్నాయి. ఇవ‌న్నీ అర్థం కావాలంటే పాల‌మూరు ఎంపీగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. జ‌య‌శంక‌ర్ సార్ సూచ‌న మేర‌కు పాల‌మూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందాను. ఆ రోజు వాస్త‌వంగా పాల‌మూరు జిల్లాలో ఉద్య‌మం బ‌లంగా లేకుండే. కానీ మీరు చూపించిన ఆద‌ర‌ణ‌తో ఎంపీగా గెలిపించారు. ఉద్య‌మ చ‌రిత్ర‌లో పాల‌మూరు జిల్లా పేరు శాశ్వ‌తంగా ఉంటుంది. ఈ జిల్లా ఎంపీగా ఉంటూనే ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించాను. ఈ జిల్లాను ఎప్ప‌టికీ మ‌రిచిపోను’ అని స్థానికి ప్రజానీకానికి సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.


అలాగే సాధించుకున్న రాష్ట్రంలో తొమ్మిదేండ్లు గ‌డిచిపోయాయని, గడిిచన కాలంలో ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేసుకుని, అన్ని రంగాల్లో భార‌త‌దేశంలోనే అగ్ర‌భాగానా ముందు వ‌రుస‌లో ఉన్నామని పేర్కొన్నారు. త‌ల‌స‌రి ఆదాయంలో మ‌న‌మే నంబ‌ర్ వ‌న్ అన్నారు. ఇంకా ‘అణగారిని ద‌ళిత జాతిని ఉద్ద‌రించాల‌నే ఉద్దేశంతో ఎక్క‌డా లేని విధంగా కుటుంబానికి 10 ల‌క్ష‌లు ఇచ్చి ద‌ళిత‌బంధు ద్వారా ఆదుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఒక నాడు ముంబై బ‌స్సుల‌కు ఆల‌వాలం పాల‌మూరు. గంజి కేంద్రాలు వెలిసేవి. పాల‌మూరులో ఈ గంజి కేంద్రాలు ఏంట‌ని ఏడ్చేవాళ్లం. గంజి కేంద్రాల పాల‌మూరు జిల్లాలో అవి మాయ‌మ‌య్యాయి. పంట కొనుగోలు కేంద్రాలు వ‌చ్చేశాయి. తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజ‌యం ఇది’ అని ధీమాగా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అదే విధంగా ‘కేసీఆర్ రాక‌ముందు ఇక్క‌డ్నుంచి మంత్రులు ఉన్నారు. కానీ మంచినీళ్లు కూడా ఇవ్వ‌లేదు. పాల‌మూరును ద‌త్త‌త‌ను తీసుకున్నారు. క‌నీసం మంచినీళ్లు ఇవ్వ‌లేక‌పోయారు. ఈ రోజు బ్ర‌హ్మాండంగా మిష‌న్ భ‌గీర‌థ ద్వారా కృష్ణా నీళ్లు దుంకుతున్నాయి. ఐదు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయి. నాగ‌ర్‌క‌ర్నూల్ మెడిక‌ల్ కాలేజీకి ప్ర‌త్యేక‌మైన చ‌రిత్ర ఉంది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వ‌న‌ప‌ర్తికి మంజూరు చేయ‌గానే మీ ఎమ్మెల్యే నా ద‌గ్గ‌రికి వ‌చ్చి మెడిక‌ల్ కాలేజీ కోరిండు. అప్పుడే ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి.. మెడిక‌ల్ కాలేజీ మంజూరు చేయించాం. ఐదు మెడిక‌ల్ కాలేజీలు పాల‌మూరు జిల్లాకు వస్తాయ‌ని క‌ల‌గ‌న్న‌మా..?’ అంటూ కేసీఆర్ ప్ర‌శ్నించారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం..