అసెంబ్లీ ఉద్యోగికి కరోనా పాజిటివ్
తెలంగాణ అసెంబ్లీలో మార్షల్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. తోటి ఉద్యోగి కరోనా బారినపడటంతో అసెంబ్లీ విధుల్లో ఉన్న సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజా అసెంబ్లీ ప్రాంగణలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. అసెంబ్లీలో మార్షల్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. అయితే ఈ నెల 22 వ తేదీ రాత్రి వరకూ సదరు మార్షల్ అసెంబ్లీలో విధులు నిర్వహించినట్లు సమాచారం. తోటి ఉద్యోగి కరోనా బారినపడటంతో అసెంబ్లీ విధుల్లో ఉన్న సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది. అటు ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు అతనితో కాంటాక్ట్ అయిన సిబ్బంది వివరాలను అసెంబ్లీ సెక్రటరి నరసింహ చార్యులు సేకరించారు. వారందరికి వైద్య పరీక్షలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అసెంబ్లీ ప్రాంగణాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నట్లు తెలిపారు సిబ్బంది.