తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ నెట్‌వర్క్‌ ఏది? ఎక్కువ మంది ఏ నెట్‌వర్క్‌ వాడుతున్నారో తెలుసా? జియో vs ఎయిర్‌టెల్‌.. హీరో ఎవరంటే..?

సెప్టెంబర్ 2025లో రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టెలికాం మార్కెట్‌ను శాసిస్తోంది. TRAI గణాంకాల ప్రకారం, జియో వైర్‌లైన్, వైర్‌లెస్ విభాగాల్లోనూ గణనీయ వృద్ధిని నమోదు చేసింది. జియోఫైబర్ ద్వారా వేల మంది కొత్త యూజర్లను చేర్చుకొని, మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌ను భారీగా పెంచుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ నెట్‌వర్క్‌ ఏది? ఎక్కువ మంది ఏ నెట్‌వర్క్‌ వాడుతున్నారో తెలుసా? జియో vs ఎయిర్‌టెల్‌.. హీరో ఎవరంటే..?
Ap Telecom Market Share

Updated on: Oct 28, 2025 | 11:05 PM

రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (ఏపీ టెలికాం సర్కిల్)లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది. సెప్టెంబర్ 2025లో సంస్థ వైర్‌లెస్ మరియు వైర్‌లైన్ రెండు విభాగాల్లోనూ గట్టి వృద్ధి సాధించింది. టెలికాం రెగ్యులేటర్ సంస్థ (TRAI) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. వైర్‌లైన్ విభాగంలో, జియో 40,641 కొత్త యూజర్లను చేర్చుకొని తన సబ్‌స్క్రైబర్ సంఖ్యను ఆగస్టులోని 17.87 లక్షల నుండి సెప్టెంబర్ 2025 నాటికి 18.28 లక్షలకు పెంచుకుంది. ఇది అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ వృద్ధి ముఖ్యంగా టియర్-II, టియర్-III నగరాల్లో జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్‌ప్రైజ్ కనెక్టివిటీ సొల్యూషన్ల పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది.

భారతి ఎయిర్‌టెల్ 12,043 మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోగా, బీఎస్ఎన్ఎల్ చిన్న స్థాయిలో మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. వొడాఫోన్ ఐడియా మాత్రం 1,310 మంది యూజర్లను కోల్పోయింది, దీని వల్ల కస్టమర్లు వేగవంతమైన జియోఫైబర్ నెట్‌వర్క్ వైపు వలస వెళ్తున్నారని సూచిస్తోంది. వైర్‌లెస్ విభాగంలో జియో 1.17 లక్షల కొత్త మొబైల్ సబ్‌స్క్రైబర్లను చేర్చుకొని తన మొత్తం యూజర్ బేస్‌ను సెప్టెంబర్ 2025 నాటికి 3.18 కోట్లకు పెంచుకుంది. దీంతో జియో మరోసారి రాష్ట్రంలోని మొబైల్ విభాగంలో టాప్ గైనర్‌గా నిలిచింది.

ఎయిర్‌టెల్ 39,248 కొత్త యూజర్లతో స్థిరమైన 3.43 కోట్ల సబ్‌స్క్రైబర్ బేస్‌ను కొనసాగించింది. బీఎస్ఎన్ఎల్ గ్రామీణ విస్తరణ, చవక ధర ప్లాన్లతో 80,840 యూజర్ల పెరుగుదల సాధించింది. అయితే వొడాఫోన్ ఐడియా దాదాపు 70,000 యూజర్లను కోల్పోయింది. మొబైల్, బ్రాడ్ బ్యాండ్.. రెండు విభాగాల్లోనూ గట్టి వృద్ధితో, జియో ప్రస్తుతం ఏపీ, తెలంగాణ టెలికాం మార్కెట్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తన ఫైబర్ ఫుట్‌ప్రింట్, 5G సిద్ధత, సమగ్ర డిజిటల్ ఎకోసిస్టమ్ ఆధారంగా జియో వినియోగదారులు, ఎంటర్‌ప్రైజ్ సెక్టార్‌లో మొదటి ఎంపిక ఆపరేటర్‌గా తన వ్యూహాత్మక ఆధిక్యాన్ని మరింత బలపరుస్తోంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి