జేఎన్‌యూ సాక్షిగా.. వివేకానందుడికి ఘోర అవమానం..

దేశరాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ సాక్షిగా స్వామి వివేకానందుడికి ఘోర అవమానం జరిగింది. క్యాంపస్‌లోని వివేకానంద విగ్రహాన్ని గురువారం రోజున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతేకాదు.. విగ్రహం దగ్గర అసభ్యకరమైన వ్రాతలు కూడా రాశారు. అయితే ఈ విగ్రహం క్యాంపస్‌లో మరెక్కడో లేదు.. సాక్షాత్తు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోని నెహ్రూ విగ్రహానికి ఎదురుగానే ఉంది. కాగా, జేఎన్‌యూ అడ్మిన్‌ బ్లాక్‌లో బుధవారం కొందరు విద్యార్ధులు ప్రవేశించి.. యూనివర్సిటీ వీసీ మామిడాల జగదీష్‌ కుమార్‌పై అభ్యంతరకర […]

జేఎన్‌యూ సాక్షిగా.. వివేకానందుడికి ఘోర అవమానం..
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2019 | 12:59 AM

దేశరాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ సాక్షిగా స్వామి వివేకానందుడికి ఘోర అవమానం జరిగింది. క్యాంపస్‌లోని వివేకానంద విగ్రహాన్ని గురువారం రోజున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతేకాదు.. విగ్రహం దగ్గర అసభ్యకరమైన వ్రాతలు కూడా రాశారు. అయితే ఈ విగ్రహం క్యాంపస్‌లో మరెక్కడో లేదు.. సాక్షాత్తు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోని నెహ్రూ విగ్రహానికి ఎదురుగానే ఉంది. కాగా, జేఎన్‌యూ అడ్మిన్‌ బ్లాక్‌లో బుధవారం కొందరు విద్యార్ధులు ప్రవేశించి.. యూనివర్సిటీ వీసీ మామిడాల జగదీష్‌ కుమార్‌పై అభ్యంతరకర కామెంట్లు రాశారు. ఆ తర్వాతి రోజే ఈ విగ్రహం ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. మరోవైపు ఇటీవల హాస్టల్ ఫీజు పెంపు, డ్రెస్ కోడ్ తదితర అంశాలపై నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్ధుల ఆందోళనలతో పెంచిన ఫీజులను జేఎన్‌యూ అధికారులు వెనక్కి తీసుకున్నారు.

Latest Articles