సుశాంత్ ఆత్మహత్య.. రియాపై పిటిషన్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య నేపథ్యంలో నటి రియా చక్రవర్తిపై పిటిషన్ దాఖలైంది. అతడి బలవన్మరణానికి రియానే కారణమని పేర్కొంటూ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య నేపథ్యంలో నటి రియా చక్రవర్తిపై పిటిషన్ దాఖలైంది. అతడి బలవన్మరణానికి రియానే కారణమని పేర్కొంటూ కుందన్ కుమార్ అనే వ్యక్తి బీహార్లోని ముజఫర్పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా సుశాంత్ నుంచి రియా పెద్ద మొత్తంలో డబ్బును తీసుకుందని కుందన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. కాగా బంధుప్రీతి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఇదివరకే పిటిషన్ దాఖలు చేసిన కుందన్.. తాజాగా రియాపై మరో పిటిషన్ దాఖలు చేయడం గమనర్హం. ఇక కుందన్ పిటిషన్పై జూన్ 24న కోర్టులో విచారణ జరగనుంది.
ఈ నేపథ్యంలో అతడి తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. ”కుందన్, సుశాంత్ వీరాభిమాని. అతడి మృతితో కుందన్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఐసీసీ 306, 420 సెక్షన్ల కింద కుందన్ పిటిషన్ దాఖలు చేశాడు” అని పేర్కొన్నాడు. కాగా ముంబయిలోని తన నివాసంలో సుశాంత్ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అభిమానులు, సన్నిహితులు సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
Read This Story Also: వొడాఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. ఫ్రీ డేటా