వొడాఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. ఫ్రీ డేటా
యూజర్లకు వొడాఫోన్ గుడ్న్యూస్ చెప్పింది. ఎలాంటి అదనపు డబ్బులు లేకుండానే వినియోగదారులకు అదనంగా 2 జీబీ, 5 జీబీ డేటాను పొందేందుకు అవకాశం ఇస్తోంది.
యూజర్లకు వొడాఫోన్ గుడ్న్యూస్ చెప్పింది. ఎలాంటి అదనపు డబ్బులు లేకుండానే వినియోగదారులకు అదనంగా 2 జీబీ, 5 జీబీ డేటాను పొందేందుకు అవకాశం ఇస్తోంది. వొడాఫోన్ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగిస్తున్న వారు ఈ ఆఫర్ను పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ కోసం వొడాఫోన్ యాప్, వెబ్సైట్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. లేకపోతే స్పెషల్ ఆఫర్ వర్తించదు. ఇక రూ.149, రూ.249, రూ.399, రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగిస్తున్న వారిని ఇది వర్తించనుంది.
రూ.149తో రీఛార్జ్ చేసుకున్న వారిని ఇప్పటికే 1 జీబీ డేటా ఇస్తుండగా.. మరో 1 జీబీ డేటాను అదనంగా పొందచ్చు. అలాగే రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్తో 2 జీబీ అదనపు డేటా రానుంది. ఇక రూ.249, రూ.399, రూ.599 రీఛార్జ్లకు రూ.5జీబీ డేటా పొందొచ్చు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య ఎక్కువ అవ్వడంతో పలు టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తోన్న విషయం తెలిసిందే.
Read This Story Also: ‘టిక్టాక్’ రౌడీ బేబీ ఆత్మహత్యాయత్నం