శ్రావణి కేసు: ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్కి పంపనున్నారు
Sravani Suicide case: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో అతడికి వైద్య పరీక్షలు పూర్తి కావడంతో.. మరికాసేపట్లో ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్కి తీసుకురానున్నారు. కోర్టులో ప్రవేశపెట్టి ఆ తరువాత రిమాండ్కి తరలించనున్నారు. మరోవైపు ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ని రెడీ చేసిన పోలీసులు.. అందులో దేవరాజ్ రెడ్డిని ఏ1గా, సాయిరెడ్డిని ఏ2గా, అశోక్ రెడ్డిని ఏ3గా చేర్చారు. ఇక ఈ కేసులో శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా చేర్చడానికి కుదరదని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.
కాగా ఈ నెల 9న శ్రావణి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. దేవరాజు వేధింపుల వలనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారితో పాటు సాయి రెడ్డి కూడా దేవరాజుపై ఆరోపణలు చేశారు. ఇక ఈ కేసులో ఆడియో టేప్లు బయటికి రావడం.. అందులో దేవరాజు, సాయి, అశోక్ రెడ్డిల వేధింపులతోనే శ్రావణి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తేలింది. ఇక వాటి ఆధారంగా దర్యాప్తును చేసిన పోలీసులు ఈ ముగ్గురిని నిందితులుగా చేర్చారు. ఇందులో దేవరాజ్, సాయి రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసి, రిమాండ్కి తరలించారు. ఇక గత వారం రోజులుగా అశోక్ రెడ్డి అఙ్ఞాతంలో ఉండగా.. ఈరోజు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read more:
ప్రారంభమైన ఆర్జీవీ బయోపిక్.. కెమెరా స్విచ్ఛాన్ చేసిన వర్మ తల్లి