IND Vs WI: కరోనా ఎఫెక్ట్.. భారత్- వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ లో మార్పులు..

|

Jan 23, 2022 | 5:55 AM

దేశంలో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. దీంతో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. కాగా ఈ మహమ్మారి

IND Vs WI: కరోనా ఎఫెక్ట్.. భారత్- వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ లో మార్పులు..
Follow us on

దేశంలో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. దీంతో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. కాగా ఈ మహమ్మారి ప్రభావం ఇప్పుడు రాబోయే భారత్- వెస్టిండీస్ సిరీస్ పై కూడా పడింది. సఫారీ పర్యటన పూర్తయిన వెంటనే ఫిబ్రవరి 6 నుంచి విండీస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జైపూర్, విశాఖపట్నం, కటక్, తిరువనంతపురం, కోల్ కతా, అహ్మదాబాద్ లలో ఈ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో ఇప్పుడు కేవలం రెండు నగరాలకే మ్యాచ్ లన్నీ జరగనున్నాయి. మూడు వన్డే మ్యాచ్ లు అహ్మదాబాద్ లో, టీ- 20 మ్యాచ్ లు కోల్ కతాలో జరగనున్నాయి.

బయో సెక్యూరిటీ ముప్పును తగ్గించేందుకు..

కరోనా వల్ల బయో సెక్యూరిటీ ముప్పు తగ్గించడంతో పాటు ఆటగాళ్లు, సిబ్బంది, అధికారులు, బ్రాడ్ కాస్టర్ల ప్రయాణాలను వీలైనంత తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా విండీస్ బోర్డు కూడా ఈ ప్రతిపాదనలను అంగీకరించింది. ఫిబ్రవరి 6- 20 ల మధ్య ఈ సిరీస్ జరగనుంది.

భారత్ -వెస్టిండీస్ సిరీస్ ఇలా..

ఫిబ్రవరి 6- మొదటి వన్డే – అహ్మదాబాద్

ఫిబ్రవరి 9- రెండో వన్డే-  అహ్మదాబాద్

ఫిబ్రవరి 11- మూడో వన్డే- అహ్మదాబాద్

ఫిబ్రవరి 16- మొదటి టీ- 20- కోల్ కతా

ఫిబ్రవరి 18 – రెండో టీ-20- కోల్ కతా

ఫిబ్రవరి 20 – మూడో టీ- 20- కోల్ కతా

Also Read: Subhas Chandra Bose: నేతాజీ 125 వ జయంతి నేడు.. ఢిల్లీలో హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

Health: ఆరోగ్యానికి మంచిద‌ని వెల్లుల్లి తెగ తింటున్నారా.? ఈ స‌మ‌స్య‌లు ఎదుర్కోక‌ త‌ప్ప‌దు..

Longest Names: ఆ పెంపుడు కుక్క పేరు చాంతాడంత.. అందుకే గిన్నిస్ ఎక్కింది. అదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి..