
చండీగఢ్లోని ముల్లన్పూర్లో గల మహరాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ఫ్యాక్టర్, పిచ్ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. అయితే మొత్తం ఐదు టీ20ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాత్లో తలబడుతున్న భారత్ ఇప్పటికే ఫస్ట్ టీ20లో విజయం సాధించి 1-0 లేడాతో ఆధిక్యంలో కొనసాగుతుంది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 తుదిజట్లు
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, శివం దుబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టాన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెర్రీరా, మార్కో జాన్సెన్, కేషవ్ మహారాజ్, లుథో సిపమ్లా, లంగి న్గిడి, అన్రిచ్ నార్జే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.