డేవిస్ కప్ మాజీ కోచ్, ఇండియన్ టెన్నిస్‌ దిగ్గజ అక్తర్ అలీ కన్నుమూత

భారత టెన్నిస్‌ దిగ్గజం, డేవిస్ కప్ మాజీ కోచ్ అక్తర్‌ అలీ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్లు. భారత జట్టుకు కెప్టెన్, కోచ్‌గా ఆయన విశేష సేవలందించారు.

డేవిస్ కప్ మాజీ కోచ్, ఇండియన్ టెన్నిస్‌ దిగ్గజ అక్తర్ అలీ కన్నుమూత

Updated on: Feb 08, 2021 | 8:11 AM

tennis legend akhtar ali : భారత టెన్నిస్‌ దిగ్గజం, డేవిస్ కప్ మాజీ కోచ్ అక్తర్‌ అలీ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అక్తర్ అలీ ఆదివారం ప్రాస్టేట్ క్యాన్సర్‌తో సహా పలు ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారని వెల్లడించారు.

ప్రస్తుత భారత డేవిస్‌కప్‌ జట్టు కోచ్‌ జీషన్‌ అలీ ఆయన కుమారుడు. అక్తర్‌ అలీ 1958 నుంచి 1964 వరకు ఎనిమిది డేవిస్‌ కప్‌ పోరాటాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారత జట్టుకు కెప్టెన్, కోచ్‌గా సేవలందించారు. రామనాథన్‌ కృష్ణన్, నరేష్‌ కుమార్, జైదీప్‌ ముఖర్జీ వంటి దిగ్గజాలతో ఆయన కలిసి ఆడారు. భారత టెన్నిస్ జట్టుకు కోచ్‌‌గా ఆయన విశేష సేవలందించారు. 1996 నుంచి 1993 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేశారు. మలేసియా, బెల్జియం జట్లకు కూడా ఆయన కోచింగ్‌ ఇచ్చారు.

దూకుడు సర్వ్ చేయడంలోనూ, వాలీ గేమ్ ఆడటంపై కోచింగ్‌లో మంచి శైలి కనబర్చారు అలీ, తన సొంత కుమారుడు జీషాన్ కాకుండా లెజండరీ లియాండర్ పేస్‌తో సహా అనేక కెరీర్‌లను రూపొందించాడు. విజయ్ అమృత్‌రాజ్, రమేష్ కృష్ణన్‌లకు అలీ కోచ్‌గా వ్యవహరించారు.

కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం.. తీవ్ర అస్వస్థతకు గురైన అలీని రెండు వారాల క్రితం కోల్‌కతా నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతని ఛాతీలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు గమనించారు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించి ఆదివారం కన్నుమూసినట్లు తెలిపారు. ఆయన మ‌‌ృతిపట్ల

“నేను జూనియర్ మరియు మా ఇండియా డేవిస్ కప్ జట్టు కోచ్ గా ఉన్నప్పుడు అక్తర్ అలీ కోచ్ గా అద్భుతమైనవాడు. ఎల్లప్పుడూ గట్టిగా నెట్టడం జట్టును సడలించింది. అతను భారత టెన్నిస్‌కు గొప్ప సేవ చేశాడు. RIP ప్రియమైన అక్తర్. జీషన్ ఎన్ తన మనోహరమైన కుటుంబానికి హృదయపూర్వక సంతాపం ”అని దిగ్గజ విజయ్ అమృత్‌రాజ్ ట్వీట్ చేశారు.

నిజమైన టెన్నిస్ లెజెండ్ అక్తర్ అలీ మరణవార్త విన్నందుకు బాధగా ఉంది. ‘అక్తర్ సర్’ భారతదేశ టెన్నిస్ ఛాంపియన్లలో చాలా మందికి శిక్షణ ఇచ్చాడు. మేము అతనికి 2015 లో బెంగాల్ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని ప్రదానం చేసాము. అతని ఆత్మీయ అభిమానాన్ని ఎల్లప్పుడూ పొందడం నా అదృష్టం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us