
ఐర్లాండ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్కు గట్టి షాక్ తగిలింది. ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ కేవలం 4 బంతుల్లో 1 ఫోర్తో 5 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఐర్లాండ్ తరపున ఆడుతున్న భారత్ సంతతికి చెందిన పేసర్ బౌలింగ్లో శాంసన్ అవుటయ్యాడు. ఇక వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ సైతం క్రీజులో ఎక్కవ సేపు నిలబడలేకపోయాడు. ఐర్లాండ్ బౌలర్ మ్యాత్యూవ్ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి కేవలం 5 బంతుల్లో 1 రన్ మాత్రమే చేసి వెనుతిరిగాడు.
ఇక ఇషాన్ కిషన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. 7 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఐర్లాండ్ బౌలర్ మ్యాథ్యూ హాలార్డ్ బౌలింగ్లో వికెట్ సమర్పించుకున్నాడు. ఇక తొలుత ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ మాత్రం వికెట్లు పడుతున్నా.. తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
కేవలం 19 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో తుఫాన్ హాఫ్ సెంచరీ చేసి భారత్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో భారత్ స్కోర్ 7.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 80 రన్స్ చేరుకుంది. అయితే ఇదే ఊపులో అభిషేక్ మ్యాచ్ను గెలిపిస్తాడనుకున్న ఫాన్స్ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. తర్వాతి ఓవర్లో మాత్యూవ్ హాలార్డ్ వేతిన బంతికి అభిషేక్ సైతం తన వికెట్ సమర్పించకొని వెనుతిరిగాడు. దీంతో భారత్ కేవలం 8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.