Virat Kohli: ఆటగాళ్లకు బయోబబుల్ కష్టాలు.. విరాట్ కోహ్లీని కుర్చీలో కట్టేశారు.. నెట్టింట వైరల్‎గా మారిన ఫొటో..

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టారు. ఈ ఫొటోను కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. ఇది "బుడగల్లో ఆడుతున్నట్లు" అనిపిస్తోందని అన్నారు...

Virat Kohli: ఆటగాళ్లకు బయోబబుల్ కష్టాలు.. విరాట్ కోహ్లీని కుర్చీలో కట్టేశారు.. నెట్టింట వైరల్‎గా మారిన ఫొటో..
Virat

Updated on: Oct 15, 2021 | 3:55 PM

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టారు. ఈ ఫొటోను కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. ఇది “బుడగల్లో ఆడుతున్నట్లు” అనిపిస్తోందని అన్నారు. బయో బబుల్లో ఉండే క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుపుతూ “బుడగలో ఆడటం అంటే ఇదే” అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లో భారత టెస్ట్ సిరీస్ నుండి కోహ్లీ బయో-బబుల్లో ఉంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వచ్చినప్పుడు ఇంగ్లాండ్‌తో పోలిస్తే అతను, ఇతర భారత సహచరులు కఠినమైన బబుల్లో ప్రవేశించారు. ఐపీఎల్‎లో ఆర్సీబీ కథ ముగిసినప్పటికీ టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌కు నాయకత్వం వహించడానికి కోహ్లీ ఇప్పుడు యూఏఈలోనే ఉండిపోయాడు.

 

ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ కూడా బయో బబుల్లో ఉండి ఆడటం గురించి మాట్లాడాడు. “ఈ సమయాల్లో బయటకు వెళ్లడం అతిపెద్ద సవాలు, బయో బబుల్లో ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణం చేయడం. సుదీర్ఘ పర్యటన ఉంటే, ఆ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండడం. ఆటగాళ్లు మానసికంగా కలవరపడవచ్చు. అది కొన్ని సమయాల్లో చిరాకు కలిగించవచ్చు .  మీరు మీ గదిలో ఉండాలి, ఆపై, మీ దేశం, ఫ్రాంఛైజీ కోసం ఆడటానికి ఒత్తిడి ఉంటుంది. కానీ ఇది మేము చేయగలిగే ఉత్తమమైనది. దీన్ని చేయడానికి మీరు మానసికంగా దృఢంగా ఉండాలి, ” మొహమ్మద్ షమీ స్పోర్ట్‌స్టార్‌తో చెప్పాడు.

 

 

Read Also.. MS.Dhoni: నెట్స్‎లో చెమటోర్చిన ఎంఎస్ ధోనీ.. ఫైనల్లో హెలికాప్టర్ షాట్‌తో మ్యాచ్ గెలిపిస్తాడా..