ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో బెంగళూరుపై గెలిచి సన్రైజర్స్ అద్భుత ఫామ్లో ఉండగా మరోవైపు ఢిల్లీ.. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ గత మ్యాచ్లో జట్టుని కొనసాగిస్తుండగా.. ఢిల్లీ మూడు మార్పులు చేసింది. ఇశాంత్ శర్మ, అక్సర్ పటేల్, రాహుల్ టెవాటియాలను ఢిల్లీ జట్టులోకి వచ్చారు.
The @SunRisers win the toss and elect to bowl first against @DelhiCapitals #DCvSRH pic.twitter.com/QCoVjcWYr4
— IndianPremierLeague (@IPL) April 4, 2019