Football Match : మ్యాచ్ జరుగుతుండగానే స్టేడియంలోకి బాంబులు విసిరిన అభిమానులు.. గాయపడిన పోలీసులు

ఇటీవల అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెల్ అవీవ్ డెర్బీ మ్యాచ్ మక్కాబి, హపోయెల్ టెల్ అవీవ్ మధ్య జరగాల్సిన పోటీ - ఆదివారం రాత్రి బ్లూమ్‌ఫీల్డ్ స్టేడియంలో హింసాత్మక ఘటనల కారణంగా రద్దు అయింది. ది సన్ నివేదిక ప్రకారం.. రెండు క్లబ్‌ల అభిమానులు స్టేడియం స్టాండ్స్ నుండి పిచ్‌పైకి ఫ్లేర్‌లు, స్మోక్ గ్రనేడ్‌లు విసిరినట్లు సమాచారం.

Football Match : మ్యాచ్ జరుగుతుండగానే స్టేడియంలోకి బాంబులు విసిరిన అభిమానులు.. గాయపడిన పోలీసులు
Football Match

Updated on: Oct 20, 2025 | 5:46 PM

Football Match : ఇటీవల అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెల్ అవీవ్ డెర్బీ మ్యాచ్ మక్కాబి, హపోయెల్ టెల్ అవీవ్ మధ్య జరగాల్సిన పోటీ – ఆదివారం రాత్రి బ్లూమ్‌ఫీల్డ్ స్టేడియంలో హింసాత్మక ఘటనల కారణంగా రద్దు అయింది. ది సన్ నివేదిక ప్రకారం.. రెండు క్లబ్‌ల అభిమానులు స్టేడియం స్టాండ్స్ నుండి పిచ్‌పైకి ఫ్లేర్‌లు, స్మోక్ గ్రనేడ్‌లు విసిరినట్లు సమాచారం. మ్యాచ్ ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత పోలీసులు తీవ్ర భద్రతా కారణాలను పేర్కొంటూ మ్యాచ్‌ను నిలిపివేసినప్పుడు 25,000 మందికి పైగా ప్రేక్షకులు అక్కడే ఉన్నారు.

అధికారులు ఈ దృశ్యాన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌గా కాకుండా, తీవ్రమైన గందరగోళం, హింసకు నిదర్శనంగా అభివర్ణించారు. ఈ ఘటనలలో ముగ్గురు పోలీసులు, ఐదుగురు అభిమానులు గాయపడ్డారు. ఒక పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ.. “అలజడి, అల్లర్లు, వస్తువులు విసరడం, స్మోక్ గ్రనేడ్‌లు, బాణసంచా, గాయపడిన పోలీసు అధికారులు, స్టేడియం మౌలిక సదుపాయాలకు నష్టం – ఇది ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ కాదు, ఇది తీవ్రమైన హింస” అని పేర్కొన్నారు.

పోలీసులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.. బ్లూమ్‌ఫీల్డ్ స్టేడియంలో జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కి ముందు జరిగిన అల్లర్ల కారణంగా మానవ ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున, మ్యాచ్‌ను అనుమతించకూడదని నిర్ణయించామని ఇజ్రాయెల్ పోలీసులు జట్లకు, జట్టు యాజమాన్యానికి, రిఫరీలకు తెలియజేశారు. శాంతంగా, క్రమబద్ధంగా వెళ్లిపోయే వరకు అభిమానులు అక్కడే ఉండాలని మేము కోరుతున్నాము” అని కూడా పిలుపునిచ్చారు.

శాంతిభద్రతలకు భంగం కలిగించినందుకు, అల్లర్లు సృష్టించినందుకు, బాటిల్స్ విసిరినందుకు, పోలీసు అధికారులపై దాడి చేసినందుకు ఐదుగురు మద్దతుదారులను అరెస్టు చేశారు. అదనంగా అక్రమ గుంపును ఏర్పాటు చేసినందుకు మరో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తాజా ఘటనలు మక్కాబి టెల్ అవీవ్ అభిమానులకు వారి యూరోపా లీగ్ మ్యాచ్‌కు హాజరుకావడానికి అనుమతి నిరాకరించిన కొన్ని రోజుల తర్వాత చోటుచేసుకున్నాయి. బర్మింగ్‌హామ్ సేఫ్టీ అడ్వైజరీ గ్రూప్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆస్టన్ విల్లాతో జరిగిన మ్యాచ్‌కు వారికి ప్రవేశం నిరాకరించారు.

ఈ నిషేధం గురించి వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ.. “ఈ నిర్ణయం ప్రస్తుత నిఘా సమాచారం, గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకున్నారు. ఇందులో 2024 యూరోపా లీగ్ మ్యాచ్‌లో అజాక్స్, మక్కాబి టెల్ అవీవ్ మధ్య ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలు, ద్వేషపూరిత నేరాల సంఘటనలు ఉన్నాయి” అని వివరించారు.

హపోయెల్ గత సీజన్‌లో రెండవ డివిజన్‌లో ఉన్నందున, ఏడాదికి పైగా ఇలాంటి డెర్బీ జరగలేదు. ఈ రెండు క్లబ్‌లు టెల్ అవీవ్‌లోని 29,400 కెపాసిటీ గల బ్లూమ్‌ఫీల్డ్ స్టేడియాన్ని పంచుకుంటాయి. మక్కాబి ప్రస్తుతం ఆరు ఆటల తర్వాత రెండవ స్థానంలో ఉంది, వారి స్థానిక ప్రత్యర్థుల కంటే ఒక పాయింట్, ఒక స్థానం పైన ఉంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు చాలా కీలకమైనది. అందుకే అభిమానులలో ఇంత ఉద్రిక్తత నెలకొంది.

 

 

 

 

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..