Smriti Mandhana: దేశమే ముఖ్యం: ఆ బాధలోనూ గ్రౌండ్‌లో దిగిన స్మృతి మంధాన..!

పలాష్ తో వివాహం విడిపోయిన తర్వాత స్మృతి మంధాన నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న తొలి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత స్మృతి మంధాన నెట్స్‌లో బ్యాట్ పట్టుకుని కనిపించడం ఇదే తొలిసారి.

Smriti Mandhana: దేశమే ముఖ్యం: ఆ బాధలోనూ గ్రౌండ్‌లో దిగిన స్మృతి మంధాన..!
Smriti Mandhana

Updated on: Dec 08, 2025 | 7:44 PM

Smriti Mandhana: టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక ఊహించని పరిణామాన్ని పక్కనపెట్టి, దేశం కోసం తిరిగి మైదానంలోకి దిగారు. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో జరగాల్సిన తన వివాహం రద్దయినట్లు ప్రకటించిన మరుసటి రోజే ఆమె క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అసలు ఏం జరిగిందంటే:

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. అయితే, తాజాగా ఈ పెళ్లి పూర్తిగా రద్దయినట్లు (called off) స్మృతి సోషల్ మీడియా ద్వారా ధృవీకరించిన సంగతి తెలిసిందే. “నా పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను. దయచేసి మా కుటుంబాల ప్రైవసీని గౌరవించండి” అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కోరారు.

ఇవి కూడా చదవండి

దేశం కోసం కన్నీళ్లు తుడిచుకొని..

ఈ వ్యక్తిగత బాధ నుంచి తేరుకోవడానికి సమయం తీసుకోకుండా, స్మృతి వెంటనే తన కర్తవ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. డిసెంబర్ 21 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం ఆమె నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది.

స్మృతి ఏమన్నారంటే..


“నన్ను నడిపించేది దేశమే. అత్యున్నత స్థాయిలొ నా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నాకు ముఖ్యం. సాధ్యమైనంత కాలం భారత్ తరపున ఆడి ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం,” అని స్మృతి తన అంకితభావాన్ని చాటుకుంది.

వ్యక్తిగత జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఆటపై ఆమెకున్న నిబద్ధతను చూసి అభిమానులు, క్రికెట్ వర్గాలు ఆమెను ప్రశంసిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..