
భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులకు ఇంట్రస్ట్ ఉంటుంది. ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఈ రెండు జట్లు ఆసియా కప్-2023లో శనివారం తలపుడుతున్నాయి. ఈ మ్యాచ్పై వర్షం ఎఫెక్ట్ కూడా గట్టిగానే ఉంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కురిసింది. దీని తర్వాత, మొదటి ఇన్నింగ్స్లో ఐదవ ఓవర్ బౌలింగ్ అవుతున్నప్పుడు కూడా వర్షం కురిసింది. రెయిన్ విరామ సమయంలో రోహిత్ కెమెరా నుండి తప్పించుకోవడం నెట్టింట వైరల్ అయ్యింది. టాస్ గెలిచిన సారథి రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. టీమ్ ఇండియాకు శుభారంభం లభించింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ జరుగుతుండగా వర్షం కురిసి మ్యాచ్ కాసేపు ఆగిపోయింది.
వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయిన సమయంలో రోహిత్ శర్మ డగ్ అవుట్లో కూర్చుని టీమ్ మేట్స్తో మాట్లాడుతున్నాడు. వర్షం ఆగిపోయింది. రోహిత్-గిల్ హెల్మెట్ ధరించి.. మళ్లీ బరిలోకి దిగేందుకు సన్నద్దమయ్యారు. ఇంతలో కెమెరామెన్ కళ్లు రోహిత్ పై పడ్డాయి. అతను కెమెరాతో రోహిత్ దగ్గరే నిలబడి షూట్ చేస్తున్నాడు. ఆ పని రోహిత్కి నచ్చలేదు. కెమెరాను తీసేయమని కెమెరామెన్ని కోరాడు. రోహిత్కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతోంది. ఇందులో అతను కెమెరాను తీసివేయమని కెమెరామెన్ని కాస్త చిరాగ్గానే కోరడం కనిపించింది.
Rohit Sharma is asking camera man to stop filming him. 😂🫣
Credit – (Hotstar)#INDvsPAK #RohitSharma pic.twitter.com/tCTqi71NDZ
— 12th Khiladi (@12th_khiladi) September 2, 2023
ఈ మ్యాచ్లో పాక్ ఫాస్ట్ బౌలింగ్ను భారత జట్టు బ్యాట్స్మెన్ ధీటుగా ఎదుర్కొంటారని అంతా భావించారు. అయితే షాహీన్ షా ఆఫ్రిది భారత బ్యాటర్లను షేక్ చేశాడు. మొదట రోహిత్ను బౌల్డ్ చేశారు షాహీన్. ఐదో ఓవర్ చివరి బంతికి షాహీన్ బౌలింగ్ లో రోహిత్ అవుటయ్యాడు. ఆ తర్వాత షాహీన్ బౌలింగ్లో కోహ్లీ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడ. హరీస్ రవూఫ్.. శ్రేయాస్ అయ్యర్, గిల్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను డకౌట్కు పంపాడు. రోహిత్ కేవలం 11 పరుగులు చేసి ఔటవ్వగా.. కోహ్లి నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయ్యర్ 14.. గిల్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. నాలుగు టాప్ వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో ఉంది భారత్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..