తిరుమల వెంకన్నను దర్శించుకున్న RCB క్రికెటర్లు! వారితో పాటు మహిళా క్రికెటర్‌ కూడా..

ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ జట్టు క్రికెటర్లు రజత్ పాటిదార్, జితేష్ కుమార్, శ్రేయస్ పాటిల్ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ సభ్యుల సహకారంతో వీవీఐపీ దర్శనం జరిగింది. జట్టు విజయాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారు ఆలయం వచ్చారని తెలుస్తోంది.

తిరుమల వెంకన్నను దర్శించుకున్న RCB క్రికెటర్లు! వారితో పాటు మహిళా క్రికెటర్‌ కూడా..
Crickters At Tirumala

Updated on: Apr 30, 2025 | 7:14 PM

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ అదరగొడుతున్న విషయం తెలిసిందే. 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో ఆర్సీబీనే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తమ టీమ్‌ ఇంత అద్భుత ప్రదర్శన కనబరుస్తుందనో ఏమో.. ఆర్సీబీ కెప్లెన్‌ రజత్‌ పాటిదార్‌, వికెట్‌ కీపర్‌ జితేష్‌ కుమార్‌, టీమిండియా మహిళా క్రికెటర్‌ శ్రేయంక పాటిల్ బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ సభ్యులు దగ్గరుండి క్రికెటర్లకు వీవీఐపీ దర్శనాలు చేయించారు. క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు అక్కడున్న భక్తులు ఎగబడ్డారు.

ఇక ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆల్‌మోస్ట్‌ ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది. మిగిలిన 4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధిస్తే.. 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్స్‌ ఉంది. అయితే.. ప్రస్తుతం ఆర్సీబీ టార్గెట్‌ మొత్తం తొలి రెండు స్థానాలపైనే ఉంది. ఎందుకంటే.. ప్లే ఆఫ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే టీమ్స్‌ మధ్య తొలి క్వాలిఫైయర్‌ జరుగుతుంది. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్‌ 2లో ఆడొచ్చు. తొలి క్వాలిఫైయర్‌లో ఓడి, ఫైనల్‌కు వెళ్లడం మిస్‌ అయినా.. మరో ఛాన్స్‌ ఉంటుంది. అందుకే ప్రతి టీమ్‌ తొలి రెండు స్థానాల్లోనే ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఆర్సీబీ టార్గెట్‌ కూడా అదే.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..