IPL 2024: నేటి మ్యాచ్లో హైదరాబాద్ ఓటమిని కోరుకుంటోన్న ఆ ఆరు జట్లు.. ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు..
ఐపీఎల్ 55వ మ్యాచ్లో ఈరోజు ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. వరుస ఓటములతో ఢీలా పడిపోయిన ముంబై ప్లేఆఫ్స్ నుంచి దాదాపు నిష్క్రమించింది. అయితే ఈరోజు హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ముంబై విజయం సాధించడం ఆ జట్టు కంటే మిగతా 6 జట్లకు చాలా ముఖ్యం.
ఐపీఎల్ 55వ మ్యాచ్లో ఈరోజు ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. వరుస ఓటములతో ఢీలా పడిపోయిన ముంబై ప్లేఆఫ్స్ నుంచి దాదాపు నిష్క్రమించింది. అయితే ఈరోజు హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ముంబై విజయం సాధించడం ఆ జట్టు కంటే మిగతా 6 జట్లకు చాలా ముఖ్యం. ప్రస్తుత సీజన్లో, ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడగా, అందులో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఆ జట్టు 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈరోజు జరిగే మ్యాచ్లో ముంబై ఓడిపోతే అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అయితే పైన చెప్పినట్లుగా ముంబై జట్టు విజయం పాయింట్ల పట్టికలో ఉన్న 6 జట్లకు లాభిస్తుంది. ఇప్పటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్లు ఆడగా అందులో 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో కూడా నాలుగో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్లో గెలిస్తే జట్టుకు 14 పాయింట్లు వస్తాయి. ఇదే జరిగితే ఇతర జట్లకు ప్లేఆఫ్ చేరడం కష్టం.
అయితే నేటి మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోతే గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ భారీగా లాభపడతాయి. అలాగే ఈ జట్లకు ప్లేఆఫ్ అవకాశాలు మరింత సుగమమవుతాయి. హైదరాబాద్ ఓటమితో లాభపడే ప్రధాన జట్లలో సీఎస్కే అగ్రస్థానంలో ఉంది. చెన్నై ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడగా, అందులో 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇవాళ హైదరాబాద్ ఓడిపోతే సీఎస్కే జట్టు మూడో స్థానంలో కొనసాగుతుంది. హైదరాబాద్ గెలిస్తే ఒక్క స్థానం కిందకు దిగుతుంది.
లక్నో సూపర్జెయింట్స్ కూడా 11 మ్యాచ్లు ఆడగా అందులో 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కానీ ఆ జట్టు నెట్ రన్ రేట్ మైనస్ 0.372. కాబట్టి 5 వ స్థానంలో ఉంది. ఈరోజు హైదరాబాద్ ఓడిపోతే ఇరు జట్లకు 11 మ్యాచ్ల నుంచి 12 పాయింట్లు ఉంటాయి. లక్నో జట్టు తమ తదుపరి మ్యాచ్లో హైదరాబాద్తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో కూడా హైదరాబాద్ ఓడిపోతే లక్నో కు ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 11 మ్యాచ్లు ఆడగా 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లు సాధించింది. ఢిల్లీకి ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్లేఆఫ్కు అర్హత సాధించాలంటే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్లు ఓటమిపాలవ్వాలి. దీని ప్రకారం ఈరోజు హైదరాబాద్ ఓడిపోతే ఢిల్లీకి కూడా ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
ఐపీఎల్లో ఈ మూడు జట్లతో పాటు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలా 4 మ్యాచ్లు గెలిచాయి. ఈ జట్లన్నింటికీ 8 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్లు మిగిలిన అన్ని మ్యాచ్లను గెలిస్తే, వారు గరిష్టంగా 14 పాయింట్లను పొందుతారు. ముఖ్యంగా, హైదరాబాద్ ఇక్కడ మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ ఓడిపోవాలి. ఇది సాధ్యమైతే హైదరాబాద్కు 12 పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్కు దూరమవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..