
ఐపీఎల్ 2021 ఆసక్తికరంగా కొనసాగుతోంది. జట్ల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. బుధవారం జరిగి మ్యాచ్లో పంజాబ్పై ముంబయి ఇండియన్స్ అలాగే ఢిల్లీపై కోల్కతా నైట్ రైడర్స్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ల తర్వాత పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

చెన్నై సూపర్ కింగ్స్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన ఈ జట్టు ఎనిమిది విజయాలను అందుకొని 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.

ఇక 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 8 విజయాలను సొంతం చేసుకొని 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. రాయల్ చాలెంజ్ బెంగళూరు 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి మూడో స్థానంలో ఉంది.

ఇక కోల్కతా 11 మ్యాచ్లకు గాను 6 గెలిచి నాలుగో స్థానంలో ఉండగా, ముంబయి 11 మ్యాచ్లకు 5 గెలిచి ఐదో స్థానలో ఉంది.

11 మ్యాచ్లు ఆడి 4 విజయాలు సొంతం చేసుకున్న పంజాబ్ 6వ స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్లు ఆడి 4 విజయాలను సొంతం చేసుకొని 7వ స్థానంలో నిలిచింది. ఇక పాయింట్ల జాబితాలో సన్రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్లు 2 విజయాలను సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

ఇక సీజన్లో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన వారికి ఇచ్చే ఆరంజ్, పర్పుల్ క్యాప్ విభాగంలో ప్రస్తుతం 454 పరుగులతో ఢిల్లీ ప్లేయర్ శిఖర్ ధావన్ ఆరంజ్ క్యాప్ రేసులో ముందుంటే, 23 వికెట్లతో బెంగళూరు జట్టుకు చెందిన హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు.