IPL 2026: ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున.. మీ టీమ్ ఎక్కడుందో చూశారా

ఐపీఎల్ 2026 వీకెండ్ మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించగా, గుజరాత్ టైటాన్స్ లక్నోపై గెలిచింది. ఈ ఫలితాలతో ఆర్సీబీ మూడో స్థానానికి చేరగా, ముంబైకి హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

IPL 2026: ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున.. మీ టీమ్ ఎక్కడుందో చూశారా
Ipl 2026 News

Updated on: Apr 13, 2026 | 1:12 PM

ఐపీఎల్ 2026 సీజన్ ఆదివారం ముగిసిన వీకెండ్ మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టిక పూర్తిగా మారిపోయింది. గత 18 సీజన్లలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ లాంటి జట్లు ప్రస్తుత సీజన్‌లో అట్టడుగు స్థానాలకు పడిపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి, 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు మూడు విజయాలు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో లభించిన పాయింట్‌తో కలిపి మొత్తం 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఆదివారం ముంబైపై సాధించిన ఘనవిజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 పాయింట్లతో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చెరో 4 పాయింట్లతో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇక పట్టికలో షాకింగ్ విషయమేమిటంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి బలమైన జట్లు నాలుగేసి మ్యాచ్‌లలో కేవలం ఒక్కో విజయం మాత్రమే సాధించి వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిదో స్థానాలకు పరిమితమయ్యాయి. ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని కోల్‌కతా నైట్ రైడర్స్ రద్దు అయిన మ్యాచ్ ద్వారా వచ్చిన ఒక్క పాయింట్‌తో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.

ఇది చదవండి: ‘బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు కప్పు కాదు చిప్ప వస్తది..’

Follow Us