IPL 2021 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!

| Edited By: Pardhasaradhi Peri

Feb 22, 2021 | 9:13 PM

IPL 2021 Auction: ఐపీఎల్ 2021 మినీ వేలం ముగియడంతో టోర్నీ కోసం ఏయే వేదికలను ఎంపిక చేయాలన్న పనిలో పడింది బీసీసీఐ. ఇప్పటికే ఐపీఎల్..

IPL 2021 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!
Follow us on

IPL 2021 Auction: ఐపీఎల్ 2021 మినీ వేలం ముగియడంతో టోర్నీ కోసం ఏయే వేదికలను ఎంపిక చేయాలన్న పనిలో పడింది బీసీసీఐ. ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్‌ను స్వదేశంలో నిర్వహిస్తామని బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబై, అహ్మదాబాద్‌లను వేదికలుగా ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. గ్రూప్ దశలో నిర్వహించే మ్యాచ్‌లను ముంబైలోని నాలుగు స్టేడియాల్లో.. ప్లేఆఫ్స్, ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం కేటాయించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఐపీఎల్ 2021ను ఏప్రిల్ మధ్య వారంలో ప్రారంభించాలని భావిస్తోంది.

త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక మినీ వేలంలో ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్స్, ఆల్ రౌండర్లను తమ జట్లను బలపరుచుకోవడంలో భాగంగా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్లకు.. మ్యాక్స్ వెల్ రూ.14.25 కోట్లకు, జెమిసన్ రూ.15 కోట్లకు అమ్ముడుపోయిన విషయం విదితమే. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికారు.

Also Read: రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!