IND vs WI : 378 రోజుల తర్వాత టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్.. వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన గిల్ సేన

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అక్టోబర్ 14, 2025న తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సరిగ్గా అదే రోజున భారత్, వెస్టిండీస్‌ను ఢిల్లీ టెస్ట్‌లో ఓడించి 2-0 తేడాతో సిరీస్‌ను గెలవడం కోచ్‌గా గంభీర్‌కు లభించిన ఒక పుట్టినరోజు బహుమతి. ఈ సిరీస్ విజయం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్‌కు దక్కిన మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయం కూడా కావడం విశేషం.

IND vs WI : 378 రోజుల తర్వాత టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్.. వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన గిల్ సేన
Ind Vs Wi (2)

Updated on: Oct 14, 2025 | 11:04 AM

IND vs WI : వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌ను ఒక ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా, తాజాగా ఢిల్లీ టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టుకు చాలా ప్రత్యేకతలు దక్కాయి. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియాకు ఇదే తొలి టెస్ట్ సిరీస్ విజయం కాగా, సరిగ్గా 378 రోజుల తర్వాత భారత జట్టు టెస్ట్ సిరీస్‌ను గెలవడం విశేషం.

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అక్టోబర్ 14, 2025న తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సరిగ్గా అదే రోజున భారత్, వెస్టిండీస్‌ను ఢిల్లీ టెస్ట్‌లో ఓడించి 2-0 తేడాతో సిరీస్‌ను గెలవడం కోచ్‌గా గంభీర్‌కు లభించిన ఒక పుట్టినరోజు బహుమతి. ఈ సిరీస్ విజయం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్‌కు దక్కిన మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయం కూడా కావడం విశేషం.

ఢిల్లీ టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి, 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ 175 పరుగులు చేసి సత్తా చాటగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీ (నాటౌట్) నమోదు చేశాడు. దీనికి సమాధానంగా బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయింది.

తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను ఫాలోఆన్ ఆడించిన భారత్, ఈ టెస్ట్‌ను కూడా ఇన్నింగ్స్ తేడాతో గెలవాలని భావించింది. అయితే, వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో గట్టి పోరాటం చేసి 390 పరుగులు సాధించారు. ఆ జట్టు తరఫున జాన్ కాంప్‌బెల్, షై హోప్ సెంచరీలు నమోదు చేశారు. దీంతో భారత్‌కు గెలవడానికి 121 పరుగుల లక్ష్యం లభించింది.

భారత బౌలర్లలో లెగ్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన కుల్‌దీప్, మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కుల్‌దీప్‌తో పాటు జడేజా, బుమ్రా చెరో 4 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. ఇక 121 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఛేదనలో కీలకమైన 58 పరుగులు (నాటౌట్) చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..