IND vs SA: కోహ్లీ సేనకు భారీ షాక్.. నలుగురు స్టార్ ప్లేయర్లకు గాయాలు.. దక్షిణాఫ్రికా టూర్‌కు డౌటే?

|

Dec 08, 2021 | 1:35 PM

India Tour Of South Africa: టీమ్ ఇండియాలో నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. వారు కోలుకోవడానికి సమయం పడుతుంది. దీంతో ఈ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోవచ్చు.

IND vs SA: కోహ్లీ సేనకు భారీ షాక్.. నలుగురు స్టార్ ప్లేయర్లకు గాయాలు.. దక్షిణాఫ్రికా టూర్‌కు డౌటే?
Ind Vs Sa
Follow us on

India vs South Africa 2021: భారత్ ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ టూర్‌కు టీమ్ ఇండియాను ప్రకటించాల్సి ఉంది. కానీ, చాలా మంది ఆటగాళ్లకు గాయాలవడంతో ఈ ప్రకటన ఆలస్యమవుతోంది. కనీసం నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారని, వారు కోలుకోవడానికి సమయం పడుతుందని సమాచారం. దీంతో ఈ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోవచ్చు. గాయపడిన ఆటగాళ్లలో ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభమాన్ గిల్ ఉన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తల ప్రకారం, ఈ నలుగురు పూర్తి ఫిట్‌గా మారడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. ముంబైలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు గాయం కారణంగా రవీంద్ర జడేజా, ఇషాంత్ దూరమయ్యారు. జడేజా లిగ్మెంట్ టియర్‌తో బాధపడుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు ఇషాంత్ వేలికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది.

అయితే ఇషాంత్ కంటే రవీంద్ర జడేజా గాయపడడం టీమిండియాకు చాలా బ్యాడ్ న్యూస్‌గా మారింది. టీమ్ ఇండియాలో ఇషాంత్‌కు ప్రత్యామ్నాయంగా ఆటగాళ్లు ఉన్నారు. కానీ, జడేజా ఎంపికకు మారుగా ఎవరు రాణిస్తారో తెలియదు. ఎందుకంటే లెఫ్టార్మ్ స్పిన్నర్, బ్యాట్స్‌మెన్ అక్షర్ పటేల్ కూడా ఫిట్‌గా లేడు. అతను కూడా గాయాలతో బాధపడుతున్నాడు. దీన్నిబట్టి ఇప్పుడు సెలక్టర్ల ముందున్న సమస్య ఈ ఇద్దరికి ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎన్నుకోవాలో తెలియడం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆర్ అశ్విన్ భారత ప్రధాన స్పిన్నర్‌గా ఉండనున్నాడు. ఇద్దరు స్పిన్నర్లకు చోటు లభించనప్పటికీ, జడేజా, అక్షర్‌లు బ్యాట్‌తో కూడా చక్కటి సహకారం అందించారు.

జడేజా-అక్షర్ స్థానంలో ఎవరు?
జడేజా గాయాలు మానడానికి కనీసం నెలల సమయం పడుతుందని వార్తలు వినిపిస్తుంది. ఒకవేళ సర్జరీ చేయించుకుంటే ఐపీఎల్‌లోనే కోలుకోగలడు. అక్షర్ పటేల్ గురించి మాట్లాడుతూ, అతని ప్రాథమిక దర్యాప్తు నివేదిక కోలుకోవడానికి కనీసం ఆరు వారాలు (ఒకటిన్నర నెలలు) పడుతుంది. వైద్య బృందంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే దక్షిణాఫ్రికాకు వెళ్లాలా వద్దా అనేది సెలక్టర్లు నిర్ణయిస్తారు. అక్షర్, జడేజా ఇద్దరూ అందుబాటులో లేకుంటే షాబాజ్ నదీమ్, సౌరభ్ కుమార్‌లను ఎంపిక చేయవచ్చని భావిస్తున్నారు. సౌరభ్ కుమార్ ప్రస్తుతం భారత్ ఏ జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు.

కాలి గాయంతో బాధపడుతోన్న గిల్..
శుభ్‌మన్ గిల్‌ను దక్షిణాఫ్రికాకు పంపే విషయంలో సెలక్టర్లు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. గిల్ కాలి గాయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంగ్లండ్ టూర్‌లో అతను ఈ గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత పర్యటన నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది కాకుండా, ముంబై టెస్టులో అతని ఎడమ చేతికి కూడా గాయమైంది. ఆ తర్వాత ఫీల్డింగ్ చేయలేదు. ఇషాంత్ శర్మ గురించి మాట్లాడుతూ, అతని వేలికి గాయమైంది. దీంతో అతని వేలికి ఏడు కుట్లు పడ్డాయంట. ఈ కారణంగా, వారు కోలుకోవడానికి సమయం పడుతుంది.

Also Read: Indian Cricket Team: రిటైర్మెంట్ ప్రకటించనున్న మరో టీమిండియా ప్లేయర్? ఐపీఎల్‌లో కొత్త అవతారానికి సిద్ధమైన స్టార్ స్పిన్నర్..!

Ashes 2021-22: కెప్టెన్‌గా మారి ఇంగ్లండ్ వెన్ను విరిచాడు.. 127 సంవత్సరాల రికార్డును సమం చేసిన ఆసీస్ బౌలర్..!