

1. హనుమ విహారి: 29 ఏళ్ల భారత క్రికెటర్ కొంతకాలం క్రితం వరకు భారత టెస్టు జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు. అయితే కొత్త ఆటగాళ్ల రాకతో తన స్థానాన్ని కోల్పోయాడు. సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో గాయపడినప్పటికీ జట్టును ఓటమి నుంచి రక్షించడంలో హనుమ విహారి కీలక పాత్ర పోషించాడు. లేకపోతే ఆస్ట్రేలియన్లు తమ రెండవ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించేవారు.

2. వాషింగ్టన్ సుందర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2020-21 గెలిచిన భారత జట్టులో ఈ యువ క్రికెటర్ కూడా ఒక భాగంగా ఉన్నాడు. అయితే గాయాల కారణంగా అతను క్రికెట్ యాక్షన్కు దూరంగా ఉన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన 3-మ్యాచ్ల టీ20ఐ సిరీస్ను వైట్వాష్ చేసిన భారత పరిమిత ఓవర్ల జట్టులో వాషిగ్టన్ సుందర్ భాగమయ్యాడు. కానీ, బీజీటీ 2023 మొదటి రెండు మ్యాచ్లు ఆడే భారత జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.

3. టి. నటరాజన్: ఈ తమిళనాడు క్రికెటర్ 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్గా వెళ్లాడు. అయితే భారత శిబిరంలో పెరుగుతున్న గాయాల కారణంగా, అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2020-21లో ఆడే అవకాశం పొందాడు. తర్వాత, అతను వన్డేలు, టీ20ఐలు కూడా ఆడాడు. యార్కర్లను సంధించడంలో పేరుగాంచిన టి.నటరాజన్ ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు. అయితే, అతను IPL 2022లో గాయం కారణంగా భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతానికి బీజీటీ 2023లో చోటు దక్కించుకోలేకపోయాడు.

4. కరుణ్ నాయర్: దేశీయ స్థాయిలో కర్ణాటక తరపున ఆడుతున్న కరుణ్ నాయర్ 2016లో ఇంగ్లండ్పై అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. భారతదేశం తరపున 6 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అయితే నాయర్ ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడనే వాస్తవం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ కొట్టిన రెండో భారతీయ క్రికెటర్గా పేరుగాంచాడు. కరుణ్ నాయర్కు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు రాకపోవడం ఖచ్చితంగా మిస్టరీగానే మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.