మేమైతే గెలిచాం.. అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే: శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer comments: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశారు. బౌలర్ల సమష్టి ప్రదర్శన, ముఖ్యంగా బుమ్రా, అర్షదీప్ బౌలింగ్‌ను ప్రశంసించారు. అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీని కొనియాడారు. శివం దూబే చివరి ఓవర్‌పై తన నిర్ణయాన్ని వివరించారు.

మేమైతే గెలిచాం.. అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే: శ్రేయాస్ అయ్యర్
Shreyas Iyer Comments

Updated on: Sep 14, 2026 | 8:01 PM

Shreyas Iyer comments: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఉమర్జై 64 పరుగుల నాటౌట్‌తో నిలవగా, నబీ 33 పరుగులు చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకోగా, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ సాధించి ఆఫ్ఘనిస్తాన్ స్కోరును కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.

157 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించిన భారత్, బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది. అభిషేక్ శర్మ కేవలం 32 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగుల మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగి, భారత విజయాన్ని సునాయాసం చేశాడు. అతనికి తోడు ఇషాన్ కిషన్ 42 రన్స్‌తో రాణించడంతో, భారత్ కేవలం 13.4 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం సాధించడం పట్ల టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ తమ బౌలర్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ విజయం కోసం అందరూ సమన్వయంతో పనిచేశారని అయ్యర్ అన్నారు. “నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా బుమ్రా జట్టుకు ఒక గొప్ప ఆస్తి” అని ప్రశంసించారు. అలాగే అర్షదీప్ సింగ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడని పేర్కొన్నారు.

అయితే, చివరి ఓవర్ ను శివం దూబే చేత వేయించడం గురించి మాట్లాడుతూ, “నిజాయితీగా చెప్పాలంటే ఆ సమయంలో తనకు వేరే మార్గం కనిపించలేదు. పిచ్ వేగం ఎలా ఉందో, బంతి ఎలా వెళ్తుందో అంచనా వేయడం దూబేకు సాధ్యం కాలేదు. ఆ సమయంలో అతను బాగా రాణిస్తాడని నేను భావించాను కానీ అలా జరగలేదు. ఇది క్రికెట్ కదా. అతను ఎక్కడ మెరుగుపడాలో కచ్చితంగా విశ్లేషించుకుంటాడు” అని అయ్యర్ వివరించారు. కాగా, 20వ ఓవర్ వేసిన శివం దూబే ఏకంగా ఓవర్‌లో 21 పరుగులు ఇచ్చాడు.

ఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్‌ను అయ్యర్ ప్రత్యేకంగా కొనియాడారు. “అతడు ఆడిన షాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి తప్పుడు షాట్లు ఆడలేదు. అతను ఎంతసేపు క్రీజ్‌లో ఉంటే అంత డేంజర్ గా మారుతాడు. అది మరోసారి నిరూపించాడు” అని శ్రేయస్ అయ్యర్ అన్నారు. ఈ విజయం భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us