IND vs SL: గంభీర్ వల్లే ఓడిన భారత్.. కొంపముంచిన ఆ 3 నిర్ణయాలు.. ఛాంపియన్స్ ట్రోఫి ఆశలకు బీటలు
Gautam Gambhir 3 Decisions Cost For India: ఒకానొక సమయంలో భారత జట్టు చాలా మెరుగైన స్థితిలో ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధించేలా కనిపించింది. కానీ, శ్రీలంక అద్భుతంగా పునరాగమనం చేసి మ్యాచ్ను గెలుచుకుంది. శ్రీలంకపై టీమ్ ఇండియా ఓడిపోవడానికి మూడు కారణాలను తెలుసుకుందాం.. ఇందులో గౌతమ్ గంభీర్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి.
Gautam Gambhir 3 Decisions Cost For India: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లోని రెండో మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయిన తీరుపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ సిరీస్లో అతను తీసుకున్న నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. దీని పర్యవసానాలను భారత జట్టు అనుభవించాల్సి వచ్చింది.
ఒకానొక సమయంలో భారత జట్టు చాలా మెరుగైన స్థితిలో ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధించేలా కనిపించింది. కానీ, శ్రీలంక అద్భుతంగా పునరాగమనం చేసి మ్యాచ్ను గెలుచుకుంది. శ్రీలంకపై టీమ్ ఇండియా ఓడిపోవడానికి మూడు కారణాలను తెలుసుకుందాం.. ఇందులో గౌతమ్ గంభీర్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి.
గౌతమ్ గంభీర్ చేసిన మూడు కీలక తప్పులు..
3. రియాన్ పరాగ్కు బదులుగా శివమ్ దూబేకి ఛాన్స్..
గౌతం గంభీర్ ఇప్పటివరకు తొలి రెండు మ్యాచ్ల్లో శివమ్ దూబేను ఆల్రౌండర్గా బరిలోకి దింపాడు. రియాన్ పరాగ్కు అవకాశం ఇవ్వలేదు. అయితే శివమ్ దూబే ఏమాత్రం రాణించలేకపోయాడు. తొలి వన్డేలో పేలవమైన ఆటతీరుతో పెవిలియన్ చేరిన దుబే.. రెండో వన్డేలో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రియాన్ పరాగ్కి అవకాశం వస్తే, బహుశా అతను శివమ్ దూబే కంటే మెరుగ్గా రాణించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Team India: కోచ్గా గంభీర్ ఎక్కువ కాలం ఉండడు: బిగ్ షాక్ ఇచ్చిన ధోని దోస్త్
2. రిషబ్ పంత్కు బదులుగా కేఎల్ రాహుల్ని ఆడించడం..
ఇప్పటివరకు శ్రీలంకతో జరిగిన తొలి రెండు వన్డేల్లో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు అవకాశం లభించింది. రిషబ్ పంత్కు ఛాన్స్ దక్కలేదు. దీని పర్యవసానాలను టీమ్ ఇండియా చవిచూడాల్సి వచ్చింది. కేఎల్ రాహుల్కు రెండు మ్యాచ్ల్లోనూ భారత్ను గెలిపించే అవకాశం ఉంది. కానీ, అతను పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. రెండో మ్యాచ్లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. అతడికి బదులు రిషబ్ పంత్కు అవకాశం రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ICC: పాక్ వెళ్లని భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రూ. 544 కోట్లతో ప్లాన్ బీ సెట్ చేసిన ఐసీసీ.. అదేంటంటే?
1. బ్యాటింగ్ ఆర్డర్లో చాలా మార్పులు..
శ్రీలంక సిరీస్లో గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్లో చాలా మార్పులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ను టాప్ ఆర్డర్లోకి పంపుతున్నారు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్లు స్థానాల్లోనూ మార్పులు చేస్తున్నారు. శివమ్ దూబే కూడా పదోన్నతి పొందినా రెండో వన్డేలో ప్రయోజనం లేకపోయింది. ఇటువంటి పరిస్థితిలో, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ ప్రయోగాలు భారతదేశానికి ఖరీదైనవిగా మారాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..