ఏఐ(ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్)తో చూడగానే నిజం అనిపించేలా రకరకాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. అందులో నిజమైంది ఏదో, ఏఐ క్రియేషన్ ఏదో గుర్తు పట్టడం కూడా చాలా కష్టంగా మారింది. చాలా మంది ఏఐ ఫొటోలను కూడా నిజం అనుకునే రేంజ్లో ఏఐ విధ్వంసం సాగుతోంది. తాజాగా ఆడపిల్లా అనే ఇంకితం కూడా లేకుండా.. ఓ క్రికెటర్తో కలిసి బికినీలో హోలీ ఆడినట్లు షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఫొటో పెట్టి ఏఐ ఫొటోలను జనరేట్ చేశారు.
ఆ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే.. ఆ ఏఐ ఫొటోలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ ఉంది కదా అని ఏది పడితే అది క్రియేట్ చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఐపీఎల్లో షారుఖ్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అదే టీమ్లో రింకూ సింగ్ కొన్ని సీజన్లుగా ఆడుతూ.. మంచి ప్రదర్శన కనబరుస్తూ.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 18 సీజన్ కోసం కూడా రింకూ సింగ్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం హోలీ సందర్భంగా కేకేఆర్ జట్టు సభ్యులతో కలిసి రింకూ సింగ్ హోలీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ ఫొటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్తో కలిసి బీచ్లో రింకూ సింగ్ హోలీ ఆడినట్లు ఏఐ సాయంతో కొంతమంది ఫొటోలు జనరేట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. వారితో పాటు మరికొంత మంది క్రికెటర్ల, హీరోయిన్ల ఫొటోలతో కూడా ఏఐ సాయంతో ఫేక్ ఫొటోలు క్రియేట్ చేశారు. ఈ ఫొటోలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..