
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తెలుగు వారికి ఎంతో సుపరిచితమే. తన ఆటతోనే కాకుండా తన రీల్స్తో భారత్లో ఎక్కువ మంది ఫ్యా ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు వార్నర్ ఏకంగా కింగ్ కోహ్లీనే వెనక్కినట్టాడు. టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లీని అధిగమించి అత్యధిక పరుగులు సాధించిన 5వ ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్లో భాగంగా ఇటీవల లండన్ స్పిరిట్ తరపున మ్యాంచెస్టర్ ఒరిజినల్స్తో జరిగిన మ్యాచ్లో వార్నర్ 71 పరుగులు చేసి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
ఈ ఇన్నింగ్స్తో డేవిడ్ వార్నర్ మొత్తం 418 టీ20 ఇన్నింగ్స్లలో 13,545 పరుగులు సాధించాడు. గతంలో ఈ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 397 టీ20 మ్యాచ్లలో 13,543 పరుగులు చేశాడు. ఈ చిన్న తేడాతో వార్నర్ కోహ్లీని అధిగమించి ఐదవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం వార్నర్ ది హండ్రెడ్ లీగ్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతను తన తదుపరి మ్యాచ్లో మరో 27 పరుగులు చేస్తే, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (13,571)ను అధిగమించి టీ20 పరుగుల జాబితాలో నాలుగవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ క్రిస్ గేల్ (14,562) ప్రపంచ రికార్డు సృష్టించాడు. షార్ట్-ఫామ్ క్రికెట్లో 455 ఇన్నింగ్స్లు ఆడిన గేల్ 10060 బంతుల్లో మొత్తం 14562 పరుగులు చేశాడు. దీంతో అతడు T20 క్రికెట్ చరిత్రలో పరుగుల స్కోరర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..