
SA vs ENG Karachi Weather Report: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో గ్రూప్ Bలో దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ మార్చి 1 శనివారం జరగనుంది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. దక్షిణాఫ్రికా ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడగా, ఒక మ్యాచ్లో విజయం సాధించగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ కారణంగా, సెమీ-ఫైనల్స్లో సౌతాఫ్రికా స్థానం ఇంకా నిర్ధారించలేదు. మరోవైపు, ఇంగ్లాండ్ తన మొదటి రెండు మ్యాచ్ల్లోనూ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ కారణంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా విజయంతో గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్కు చేరుకోవాలని కోరుకుంటుండగా, ఇంగ్లాండ్ జట్టు విజయంతో తన ప్రయాణాన్ని ముగించాలని ప్రయత్నిస్తుంది.
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి కొన్ని మ్యాచ్లలో, వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్లు కూడా రద్దు అవుతున్నాయి. నిన్న, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ముఖ్యమైన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తి కాలేదు. చివరికి రద్దు చేయవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో, దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ సమయంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త ఉంది. ఈ సమయంలో కరాచీలో వర్షం పడే అవకాశం లేదు. వాతావరణం చాలా బాగుంటుంది. దీని కారణంగా అభిమానులు ఎటువంటి అంతరాయం లేకుండా మ్యాచ్ను చూడగలుగుతారు. అక్యూవెదర్ ప్రకారం, శనివారం ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీల సెల్సియస్ ఉంది. క్రికెట్ ఆడటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆసియా పరిస్థితుల్లో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు మంచు ఎల్లప్పుడూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.
అంచనాకు విరుద్ధంగా కరాచీలో వర్షంతో మ్యాచ్ జరగకపోతే, ఆఫ్ఘనిస్తాన్ షాక్ కి గురవుతుంది. నిజానికి, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ రద్దు అయిన తర్వాత, ఆఫ్ఘన్ జట్టు ఖాతాలో 3 పాయింట్లు ఉన్నాయి. దాని నెట్ రన్ రేట్ -0.990. దక్షిణాఫ్రికా కూడా 3 పాయింట్లను కలిగి ఉంది. కానీ, నెట్ రన్ రేట్ +2.140. ఇటువంటి సందర్భంలో, ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాను పెద్ద తేడాతో ఓడిస్తే, సౌతాఫ్రికా నెట్ రన్ రేట్ తగ్గిపోతుంది. హష్మతుల్లా షాహిది జట్టు మొదటి నాలుగు స్థానాలకు చేరుకుంటుందనే వాస్తవంపై ఆఫ్ఘనిస్తాన్ ఆశలు పెట్టుకుంది. కానీ, మ్యాచ్ రద్దు అయితే దక్షిణాఫ్రికా కూడా 1 పాయింట్ పొందుతుంది. అది 4 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్కు చేరుకుంటుంది.
సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ వర్షంతో రద్దయితే, సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉండే ఛాన్స్ ఉంది. అప్పుడు ఆస్ట్రేలియాతో భారత జట్టు ఢీ కొంటుంది. ఒకవేళ మ్యాచ్ జరిగి సౌతాఫ్రికా టీం గెలిస్తే, ఆ జట్టు అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పుడు సౌతాఫ్రికాతో భారత జట్టు ఢీ కొంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..