చాహల్-ధనశ్రీ వర్మ విడాకులపై బిగ్ అప్‌డేట్.. ఐపీఎల్ ఎఫెక్ట్‌తో ఆ తేదీలోగా తీర్పు.. భరణం ఎంతంటే?

Yuzvendra Chahal Dhanashree Verma Divorce: ఇద్దరూ దాదాపు రెండున్నర సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారని, భరణంకు సంబంధించి ఇద్దరి మధ్య అంగీకరించిన నిబంధనలు, షరతులను పాటిస్తున్నారని జస్టిస్ మాధవ్ కూలింగ్ పీరియడ్‌ను రద్దు చేశారు. కుటుంబ కోర్టు ప్రకారం, చాహల్ ధనశ్రీకి రూ.4.75 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు. అందులో అతను ఇప్పటికే రూ.2.37 కోట్లు ఇచ్చాడంట.

చాహల్-ధనశ్రీ వర్మ విడాకులపై బిగ్ అప్‌డేట్.. ఐపీఎల్ ఎఫెక్ట్‌తో ఆ తేదీలోగా తీర్పు.. భరణం ఎంతంటే?
Chahal Dhanashree

Updated on: Mar 19, 2025 | 7:39 PM

Yuzvendra Chahal Dhanashree Verma Divorce: భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ దాదాపు విడిపోయారు. ఇద్దరూ దాదాపు రెండు సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. తాజాగా వీరి విడాకులపై మార్చి 20 నాటికి నిర్ణయం రావొచ్చని తెలుస్తోంది. ఐపీఎల్‌లో చాహల్ బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని, విడాకుల ప్రక్రియపై గురువారం నాటికి తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టు బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది.

మార్చి 22 నుంచి చాహల్ IPL 2025 లో బిజీగా ఉంటాడు. ఈసారి అతను పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. పంజాబ్ జట్టు మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. మెగా వేలంలో పంజాబ్ చాహల్‌ను రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. చాహల్ న్యాయవాదితో మాట్లాడినట్లు జస్టిస్ మాధవ్ జాందార్ ధర్మాసనం తెలిపింది. మార్చి 21 తర్వాత, చాహల్ ఐపీఎల్‌లో బిజీగా ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాలేడని ఆయన అన్నారు. ఈ కారణంగా, మార్చి 20 లోపు విడాకుల కేసులో తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన చాహల్, ధనశ్రీ..

చాహల్, ధనశ్రీ పరస్పర అంగీకారంతో ఫిబ్రవరి 5న కుటుంబ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆరు నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను వదులుకోవడానికి కుటుంబ కోర్టు నిరాకరించింది. ఆ తరువాత, వారిద్దరూ హైకోర్టులో ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేశారు. నిజానికి, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13B ప్రకారం విడాకులకు, జంట కలిసి జీవించే అవకాశాలను అన్వేషించడానికి ఆరు నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ అవసరం. అయితే, పార్టీల మధ్య వివాద పరిష్కారానికి అవకాశం లేకపోతే, కూలింగ్ ఆఫ్ వ్యవధిని వదులుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇద్దరూ దాదాపు రెండున్నర సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారని, భరణంకు సంబంధించి ఇద్దరి మధ్య అంగీకరించిన నిబంధనలు, షరతులను పాటిస్తున్నారని జస్టిస్ మాధవ్ కూలింగ్ పీరియడ్‌ను రద్దు చేశారు. కుటుంబ కోర్టు ప్రకారం, చాహల్ ధనశ్రీకి రూ.4.75 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు. అందులో అతను ఇప్పటికే రూ.2.37 కోట్లు ఇచ్చాడంట.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us