Rohit Sharma: హిట్‌మ్యాన్‌పై అనుమానాలు ఎందుకు? సెలెక్టర్లకు అజింక్య రహానే కీలక సూచన

Rohit Sharma: 2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ ఉండాల్సిందేనని మాజీ క్రికెటర్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. రోహిత్, విరాట్ కోహ్లీలకు జట్టు యాజమాన్యం పూర్తి మద్దతు ఇవ్వాలని, ప్రతి సిరీస్‌తో వారి ఫామ్‌ను అంచనా వేయడం సరికాదని సూచించాడు.

Rohit Sharma: హిట్‌మ్యాన్‌పై అనుమానాలు ఎందుకు? సెలెక్టర్లకు అజింక్య రహానే కీలక సూచన
Rohit Sharma

Updated on: Aug 09, 2026 | 4:44 PM

Rohit Sharma: సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ టీమిండియాలో అప్పుడే సన్నాహకాలతో పాటు జట్టు కూర్పుపై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. 2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ స్థానంపై ఎలాంటి అనుమానాలు, చర్చలు అవసరం లేదని, అతను జట్టులో ఉండేలా సెలెక్టర్లు స్పష్టత ఇవ్వాలని రహానే బలంగా వ్యాఖ్యానించాడు.

అనుభవానికి ఫాంతో సంబంధం లేదు

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రహానే మాట్లాడుతూ.. “2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ ఉన్నాడని టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. గడిచిన కొన్నేళ్లుగా భారత క్రికెట్‌కు అతను అందించిన సేవలు అద్భుతం. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో రోహిత్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి అవసరం ఎంతగానో ఉంటుంది. దీనిపై ఇకపై ఎలాంటి చర్చలు జరగకూడదు. అతను చాలా పెద్ద ప్లేయర్, కాబట్టి ప్రతి సిరీస్ ఆధారంగా అతని ప్రదర్శనను అంచనా వేయడం సరికాదు” అని పేర్కొన్నాడు. ఆటగాళ్లకు ఫాం అప్‌ అండ్ డౌన్ కావడం సహజమని, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉండే నాకౌట్ మ్యాచుల్లో రోహిత్ శర్మ అనుభవం, ఆలోచనా సరళి జట్టుకు నిర్ణయాత్మక విజయాలను అందిస్తాయని అభిప్రాయపడ్డాడు.

విరాట్ కోహ్లీకి కూడా రహానే మద్దతు

రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ విషయంలోనూ రహానే ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సీనియర్ ఆటగాళ్లకు జట్టు యాజమాన్యం, కెప్టెన్ పూర్తి మద్దతు ఇచ్చినప్పుడు వారు మరింత మెరుగ్గా ఆడతారని అన్నాడు. వారిని ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడనివ్వాలని, 2027 ప్రపంచకప్ వరకు వారు ఆడాలనుకుంటే కచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పాడు. ప్రతి క్రీడాకారుడి కెరీర్‌లోనూ వయసు, ఫారమ్‌కు సంబంధించిన దశలు వస్తాయని, అయితే వారి క్లాస్, టెంపరమెంట్‌ను శంకించలేమని స్పష్టం చేశాడు.

రోహిత్ శర్మ స్థానంపై ఎందుకు వివాదం?

టెస్టులు, టి20 ఫార్మాట్ల నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డేల్లో నిష్ణాతుడైన ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు. 39 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటికీ రోహిత్ తన ఫిట్‌నెస్‌పై తీవ్రంగా శ్రమిస్తూ అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నాడు. అయితే 2027 నాటికి వయస్సు మరింత పెరుగుతుందనే కారణంతో కొందరు అతని ఎంపికపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత రోహిత్ వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తాడంటూ వచ్చిన వార్తలు కేవలం పుకార్లేనని, అలాంటి వార్తలను రోహిత్ తన శైలిలో తిప్పికొట్టాడని స్పష్టమైంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us