ధోని కొత్త వ్యాపారం.. కార్స్ 24లో పెట్టుబడులు

| Edited By: Pardhasaradhi Peri

Aug 14, 2019 | 9:38 AM

టీమిండియా మాజీ సారధి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మరో వ్యాపారంలోకి అగుడుపెట్టాడు. గురుగ్రామ్ కేంద్రంగా నడిచే కార్స్ 24 సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. తమ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా పెంచుకునేందుకు ధోనితో వ్యహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని కార్స్ 24 సంస్థ వెల్లడించింది. దీనితో ధోని ఆ సంస్థలో కొంతమేరకు వాటా సొంతం చేసుకోవడమే కాకుండా ప్రచారకర్తగా కూడా వ్యవహరించనున్నాడు. కార్స్ 24 ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ధోని అన్నాడు. సృజనాత్మక, నవ కల్పనలు […]

ధోని కొత్త వ్యాపారం.. కార్స్ 24లో పెట్టుబడులు
Follow us on

టీమిండియా మాజీ సారధి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మరో వ్యాపారంలోకి అగుడుపెట్టాడు. గురుగ్రామ్ కేంద్రంగా నడిచే కార్స్ 24 సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. తమ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా పెంచుకునేందుకు ధోనితో వ్యహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని కార్స్ 24 సంస్థ వెల్లడించింది. దీనితో ధోని ఆ సంస్థలో కొంతమేరకు వాటా సొంతం చేసుకోవడమే కాకుండా ప్రచారకర్తగా కూడా వ్యవహరించనున్నాడు.

కార్స్ 24 ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ధోని అన్నాడు. సృజనాత్మక, నవ కల్పనలు చేసే కొత్తతరం సంస్థల్లో కార్స్ 24 కూడా ఒకటని.. భారీ లక్ష్యాల్ని చేరుకొనేందుకు వారికి నా వంతు సహాయం చేస్తానని ధోని పేర్కొన్నాడు.