Ttd Donation: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. రూ. 6 కోట్ల విలువైన..

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భారీ విరాళం అందింది. దాదాపు రూ.2.45 కోట్లు విలువజేసే నాలుగు కేజీల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చి స్వామిపై ఉన్న భక్తిని..

Ttd Donation: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. రూ. 6 కోట్ల విలువైన..
Ttd

Edited By:

Updated on: Jun 10, 2022 | 6:54 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భారీ విరాళం అందింది. దాదాపు రూ.2.45 కోట్లు విలువజేసే నాలుగు కేజీల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చి స్వామిపై ఉన్న భక్తిని చాటుకున్నారు చైన్నైకు చెందిన భక్తురాలు సరోజా సూర్యనారాయణ. 4,150 గ్రాముల వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతం, లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా అందించారు. దీంతో పాటూ చైన్నైలో రూ.3.50 కోట్లు విలువజేసే స్థలాన్ని కూడా విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలను అందించారు భక్తురాలు సరోజా సూర్య నారాయణ.

మొన్నటికి మొన్న లియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన భక్తులు కళ్లు చెదిరే రీతిలో భారీగా విరాళం ప్రకటించారు. ఏకంగా రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేసి స్వామివారి పట్ల వారికున్న భక్తిని చాటుకున్నారు. టీటీడీ చరిత్రలో అధిక మొత్తంలో ఒకేరోజు ఇంత భారీగా విరాళం రావ‌డం ఇదే మొద‌టిసారి అని ఆల‌య అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us