శని అమావాస్య ప్రత్యేక రోజు. ఈ రోజు అమావాస్య, శనివారం కలిసి వస్తాయి. ఈ రోజున శనీశ్వరుడు ప్రత్యేకంగా పూజించడం ద్వారా.. శని దోషం, ఏలి నాటి శని, శని ధైయా నుంచి ఉపశమనం లభిస్తుంది. జాతకంలో శనీశ్వరుడు బలహీనంగా ఉన్నా.. లేక పీడితంగా ఉన్నవారికి కూడా ఈ రోజు ముఖ్యమైనది.
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం శని అమావాస్య మార్చి 29న వచ్చింది. ఈ రోజున శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. పాల్గుణ మాసంలో అమావాస్య తిధి మార్చి 28న సాయంత్రం 7:55 గంటలకు మొదలైంది. ఈ తిధి మార్చి 29న సాయంత్రం 4:27 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రకారం శని అమావాస్య మార్చి 29న జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇది మొదటి శని అమావాస్య. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా ఈ రోజున ఏర్పడుతుంది.
శని అమావాస్య రోజున శనిదేవుడిని పూజించడం వల్ల ఆయన ఆశీస్సులు లభిస్తాయి. శని దోషం, ఏలి నాటి శని, శని ధైయా ప్రభావంతో ఇబ్బంది పడుతున్నవారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం చేయబడింది. కనుక ఈ రోజున పూర్వీకుల శాంతి కోసం పూజలు కూడా చేస్తారు. శనిదేవుడిని కర్మలకు న్యాయనిర్ణేతగా పరిగణిస్తారు.. కనుక ఈ రోజున మంచి పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఎవరి జాతకంలోనైనా శని అశుభ స్థితిలో ఉంటే.. ఈ రోజున ఆయన్ని పూజించడం వల్ల శాంతి కలుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు