
ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజక్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. సమతాకుంభ్ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆరో రోజు ఉదయం సుప్రభాత గోష్ఠితో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. చినజీయర్స్వామి మార్గనిర్దేశంలో అందరూ ధ్యాన పద్ధతిని నేర్చుకున్నారు. ఆ తర్వాత అష్టాక్షరీ మంత్రజపంతో పాటు ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. సేవాకాలం, శాత్తుముఱై తర్వాత భక్తులందరికీ స్వామివారు తీర్థం అందజేశారు.
ఆ తర్వాత 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ జరిగింది. గరుడ సేవలో వేంచేసిన 18 మంది పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు జరిగాయి.
కాగా.. సాయంత్రం 5 గంటల నుంచి జరిగే 108 దివ్యదేశ మూర్తుల శాంతి కల్యాణానికి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అంగరంగ వైభవంగా ముస్తాబైంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..