Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కనుమరోజున ఏకాంతంగా శ్రీవారి పార్వేటు ఉత్సవం.. రేపు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి..

|

Jan 16, 2022 | 7:12 AM

Tirupati: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి (Tirumala Tirupati) క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్న రీతిన ఉంటుంది. స్వామివారికి ఏడాది పొడవునా ఏదోక ఉత్సవం..

Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కనుమరోజున ఏకాంతంగా శ్రీవారి పార్వేటు ఉత్సవం.. రేపు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి..
Ttd
Follow us on

Tirupati: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి (Tirumala Tirupati) క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్న రీతిన ఉంటుంది. స్వామివారికి ఏడాది పొడవునా ఏదోక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. శ్రీవారికి నిర్వహించే సాంప్రదాయక ఉత్సవాల్లో ఒకటి శ్రీ‌వారి పార్వేటు ఉత్సవం(Paruveta Utsavam). ఈ ఏడాది ఈ పార్వేటు ఉత్సవాన్ని శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో టిటిడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీ‌వారి పార్వేటు ఉత్సవం సాంప్రదాయక వార్షిక ఉత్సవం. ఈ ఉత్స‌వాన్ని ప్రతి సంవత్సరం కనుమ రోజున జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో శ్రీ మలయప్ప స్వామి అడవులకు వెళ్లి తన భక్తులను రక్షించడానికి క్రూర మృగాలను వేటాడతారు. కానీ కోవిడ్ ప్రభావం కారణంగా, గత సంవత్సరం కల్యాణోత్సవ మండపం లోపల వనాన్ని పునర్నిర్మించి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపధ్యంలో ఈ సంవత్సరం కూడా గ‌త ఏడాది నిర్వ‌హించిన విధంగానే ఏకాంతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.

అదేవిధంగా రేపు (జనవరి 17వ తేదీన )న తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటిని జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ఏకాంతంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ విషయాన్ని గమనించ‌మని టిటిడీ విజ్ఞప్తి చేసింది.

Also Read:
Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది… నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..