Prakasam: కన్నుల పండుగగా రఘునాయక స్వామి కళ్యాణం.. అకస్మాత్తుగా ప్రత్యక్షమై గరుడ పక్షి ప్రదక్షిణలు

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతా లక్ష్మణ సమేత రఘునాయక స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు.

Prakasam: కన్నుల పండుగగా రఘునాయక స్వామి కళ్యాణం.. అకస్మాత్తుగా ప్రత్యక్షమై గరుడ పక్షి ప్రదక్షిణలు

Updated on: Apr 07, 2023 | 3:47 PM

ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహొత్సవం
అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడ తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపారని అందువల్లే ఈ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు వచ్చిందని స్థలపురాణం. ప్రతి ఏటా చైత్ర శుద్ధ దశమి నుంచి 16 రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

గరుడపక్షి ఆగమనం…

ఈ కళ్యాణ వేడకల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదే, స్వామివారి కళ్యాణం రోజున స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు కళ్యాణ క్రతువును ప్రారంభించారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళ్లింది. భక్తులు గరుడపక్షిని చూసి భక్తితో మైమరచిపోయారు. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. కన్నులపండువగా నిర్వహించిన ఈ కళ్యాణవేడకుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us